NEET PG 2022 Counselling : నీటీ పీజీ కౌన్సిలింగ్ రౌండ్ 1లో.. ఛాయిస్ ఫిల్లింగ్ ప్రక్రియ ఆదివారంతో ముగియనుంది. నీట్ పీజీ 2022 కౌన్సిలింగ్ రౌండ్ 1 కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు.. ఆదివారం రాత్రి 11:55 గంటల లోపు కాలేజీల ఛాయిస్ను నింపాల్సి ఉంటుంది.
నీట్ పీజీ 2022 కొన్సిలింగ్ ఏఐక్యూ రౌండ్ 1 రిజిస్ట్రేషన్ ప్రక్రియను శుక్రవారం మూసివేసింది ఎంసీసీ (మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ). అభ్యర్థుల వెరిఫికేషన్ను విద్యాసంస్థలు శనివారం చేయనున్నారు. ఇక నీట్ పీజీ రౌండ్ 1 సీట్ల కేటాయింపు వివరాలు ఈ నెల 28న వెలువడనున్నాయి.
నీట్ పీజీ 2022 కౌన్సిలింగ్కి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు 'sandes' అనే యాప్ను అభ్యర్థులు ఇన్స్టాల్ చేసుకోవాలని ఎంసీసీ విజ్ఞప్తి చేసింది.
సంబంధిత కథనం
టాపిక్