Free travel scheme: వారందరికి.. ఆర్​టీసీ బస్సుల్లో ఉచిత పర్యటనలు- ప్రభుత్వం ప్రకటన-maharashtra begins free travel scheme for those above 75 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Maharashtra Begins Free Travel Scheme For Those Above 75

Free travel scheme: వారందరికి.. ఆర్​టీసీ బస్సుల్లో ఉచిత పర్యటనలు- ప్రభుత్వం ప్రకటన

Sharath Chitturi HT Telugu
Aug 27, 2022 12:33 PM IST

Free travel scheme : 75ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత పర్యటన స్కీమ్​ను ప్రవేశపెట్టింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఆ వివరాలు..

వారందరికి.. ఆర్​టీసీ బస్సుల్లో ఉచిత పర్యటనలు- ప్రభుత్వం ప్రకటన
వారందరికి.. ఆర్​టీసీ బస్సుల్లో ఉచిత పర్యటనలు- ప్రభుత్వం ప్రకటన (AFP)

Free travel scheme : 75ఏళ్లు పైబడిన వృద్ధులకు.. ఉచిత పర్యటన వెసులుబాటును ప్రారంభించింది ఎమ్​ఎస్​ఆర్​టీసీ(మహారాష్ట్ర స్టేట్​ రోడ్​ ట్రాన్స్​పోర్ట్​ కార్పొరేషన్​). ప్రభుత్వ ఆధారిత బస్సుల్లో ఇకపై 75ఏళ్లు పైబడిన వృద్ధులు ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

ఈ ఫ్రీ ట్రావెల్​ స్కీమ్​లో భాగంగా.. ఆగస్టు 26కి ముందు ఎవరైనా టికెట్లు బుక్​ చేసుకుని ఉంటే.. వారందరికి డబ్బులు రీఫండ్​ కూడా చేస్తామని మహారాష్ట్ర ఆర్​టీసీ వెల్లడించింది.

బస్సులో వృద్ధుల ఉచిత ప్రయాణాలకు సంబంధించి.. కొన్ని రోజుల క్రితమే మహారాష్ట్ర సీఎం ఏక్​నాథ్​ షిండే.. ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఆజాదీకా అమృత్​ మహోత్సవ్​ నేపథ్యంలో జరిగిన కేబినెట్​ సమావేశంలో షిండే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Maharashtra Free travel scheme : ప్రభుత్వ ఆధారిత బస్సులో ఈ ఉచిత పర్యటనను పొందాలనుకునే వారు.. ఆధార్​ వంటి గుర్తింపు కార్డులను చూపించాల్సి ఉంటుంది. అప్పుడే వారికి ఉచిత పర్యటన స్కీమ్​ వర్తిస్తుంది.

రాష్ట్రంలో చేపట్టే పర్యటనలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. దీనికి మంచి ప్రత్యేక వెసులుబాటులు ఏమీ లేవు.

ఎంపిక చేసిన ఎమ్​ఎస్​ఆర్​టీసీ బస్సుల్లో ప్రయాణించే 65-75 మధ్య వయస్కులకు.. టికెట్​ ధరలో 50శాతం రిబేట్​ లభిస్తుంది.

ఎమ్​ఎస్​ఆర్​టీసీకి ప్రస్తుతం 16000 బస్సులు ఉన్నాయి. కొవిడ్​ సంక్షోభానికి ముందు.. రోజుకు 65వేల మంది ఆయా బస్సుల్లో ప్రయాణించేవారు.

MSRTC : ఇక మళ్లీ ఆర్​టీసీలోకి ప్రజలకు ఆహ్వానించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే ఉచిత పర్యటన స్కీమ్​ చేపట్టింది. మరోవైపు.. ముంబై- పుణె మధ్య 100కుపైగా ఏసీ ఎలక్ట్రిక్​ బస్సుల సేవలను సైతం ప్రారంభించింది. వీటికి ఆదరణ లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్