Government employees strike : ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె బాట.. ఎన్నికల ముంగిట సీఎంకు తలనొప్పి!-government employees set to go on strike in karnataka cm attempts to assuage concerns ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Government Employees Set To Go On Strike In Karnataka, Cm Attempts To Assuage Concerns

Government employees strike : ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె బాట.. ఎన్నికల ముంగిట సీఎంకు తలనొప్పి!

Sharath Chitturi HT Telugu
Feb 28, 2023 02:46 PM IST

Karnataka government employees strike : మార్చ్​ 1 నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులు నిర్ణయించుకున్నారు. తమ డిమాండ్​లను ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.

నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులు
నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులు (HT_PRINT)

Karnataka government employees strike : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కర్ణాటక ప్రభుత్వంపై భారీ పిడుగు పడింది! గత కొంతకాలంగా ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న ఉద్యోగులు.. మార్చ్​ 1, అంటే బుధవారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నారు. తాజా పరిణామాలు.. కర్ణాటక సీఎం బసవరాజ్​ బొమ్మైకు తలనొప్పిగా మారినట్టు కనిపిస్తోంది.

3 కీలక డిమాండ్​లు..

ప్రభుత్వం ముందు మూడు కీలక డిమాండ్​లను పెట్టారు ఉద్యోగులు. అవి.. 7వ పే కమిషన్​ నివేదిక అమలు, పాత పింఛను పథకం అమలు, ఫిట్​మెంట్​ వెసులుబాటులో కనీసం 40శాతం అమలు. వీటిని పరిష్కరించకపోవడంతో నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్టు ప్రకటించారు. పలు రవాణా, అత్యవసర సేవలు మినహా.. దాదాపు అన్ని అంశాలపైనా ప్రభుత్వ ఉద్యోగుల నిరవధిక సమ్మె ప్రభావం పడనుందని తెలుస్తోంది.

Karnataka employees strike news : రాష్ట్రవ్యాప్తంగా రవాణా, అత్యవసర సేవలపైనా తమ నిరవధిక సమ్మె ప్రభావం ఉంటుందని కర్ణాటక స్టేట్​ గవర్న్​మెంట్​ ఎంప్లాయీస్​ అసోసియేషన్​ ప్రెసిడెంట్​ సీఎస్​ సదాక్షరి తెలిపారు. వీటితో పాటు మహానగర పాలిక, పుర సభ, పౌరకార్మిక సేవలు కూడా దెబ్బ తినే అవకాశం ఉంది. రెవెన్యూ కలెక్షన్లు, స్కూళ్లు, ప్రీ- వర్సిటీ పరీక్షలపైనా ప్రభావం పడనుంది.

"ఇది మేము ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. మా డిమాండ్ల పరిష్కారానికి 8 నెలల ఆలస్యమైంది. ఇంక మేము ఎదురుచూడలేము. త్వరలో ఎన్నికలు ఉన్నాయి. కొత్త ప్రభుత్వం వస్తే.. ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అందుకే.. ఉద్యోగులు స్వచ్ఛందంగా స్ట్రైక్​లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు," అని సదాక్షరి తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగులతో చర్చలు ఫలిచేనా?

Karnataka employees strike : ఈ వ్యవహారాన్ని సీఎం బసవరాజ్​ బొమ్మై తీవ్రంగా పరిగణిస్తున్నట్టు సమాచారం. దిద్దుబాటు చర్యల్లో భాగంగా.. ప్రభుత్వ ఉద్యోగులతో అధికారులు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. 7వ పే కమిషన్​ మధ్యంతర నివేదికను పూర్తి చేసి, దానిని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఉద్యోగులకు బొమ్మై సంకేతాలు పంపించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Karnataka Government latest news : "ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలతో మా సీనియర్​ అధికారులు చర్చలు జరుపుతున్నారు. 7వ పే కమిషన్​ను నియమించింది మేమే. 2023-24లోనే దానిని అమలు చేస్తామని అసెంబ్లీ వేదికగా నేను స్పష్టం చేశాను. అందుకు తగ్గట్టుగానే ఈ దఫా బడ్జెట్​లో నిధులను కూడా కేటాయించాము," అని మీడియాతో చెప్పారు బసవరాజ్​ బొమ్మై. 7వ పే కమిషన్​ మధ్యంతర నివేదికను తీసుకుని, అమలు చేయాలన్ని ఉద్యోగుల డిమాండ్​కు తాను అంగీకరించినట్టు ప్రకటించారు.

IPL_Entry_Point