Ayodhya Ram Lalla rituals: అయోధ్యలో బాల రాముడి రజత విగ్రహానికి పూజలు-day 4 of rituals holy fire lit ram lallas silver idol worshipped ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ayodhya Ram Lalla Rituals: అయోధ్యలో బాల రాముడి రజత విగ్రహానికి పూజలు

Ayodhya Ram Lalla rituals: అయోధ్యలో బాల రాముడి రజత విగ్రహానికి పూజలు

HT Telugu Desk HT Telugu

Ayodhya Ram Lalla rituals: అయోధ్యలో బాల రాముడి విగ్రహానికి జనవరి 22వ తేదీన ప్రాణ ప్రతిష్ట జరగనున్న నేపథ్యంలో.. వారం రోజుల ముందు నుంచి నూతనంగా నిర్మించిన రామాలయంలో వైదిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

జనవరి 22 న ప్రాణ ప్రతిష్ట జరుపుకోనున్న బాల రాముడి విగ్రహం

Ayodhya Ram Lalla rituals: బాలరాముడి విగ్రహానికి జనవరి 22న జరిగే ప్రధాన ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి ముందు అయోధ్యలో జరుగుతున్న వారోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం పవిత్ర అగ్నిని వెలిగించడం హైలైట్ గా నిలిచింది. 121 మంది పూజారుల బృందం ఈ కార్యక్రమం నిర్వహించారు.

వైదిక క్రతువులు..

రామాలయ ప్రాంగణంలో ఈ పవిత్ర అగ్నిని అనేక హవన్ కుండలను (అగ్ని గుంత) వెలిగించడానికి ఉపయోగించారు. ప్రధాన అర్చకుడు లక్ష్మీకాంత్ దీక్షిత్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం స్వామివారికి ఔషధివులు, కేశరాధివులు, ఘృతాధివాలు (వనమూలికలు, కుంకుమపువ్వు, నెయ్యి) సమర్పించారు. సాయంత్రం రెండో విడుతలో ధాన్యాదివాస్ నిర్వహించి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు.

వెండి విగ్రహం

బాల రాముడి చిన్న వెండి విగ్రహానికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. వైదిక ఆచారాలను నిర్వహించడంలో సౌలభ్యం కోసం 51 అంగుళాల రామ్ లల్లా ముఖ్య విగ్రహానికి ప్రతినిధిగా.. చిన్న, వెండి విగ్రహాన్ని కూడా సిద్ధం చేశారు. ఈ విగ్రహాన్ని ఆలయ గర్భగుడిలో ప్రతిష్ఠించనున్నారు. కొత్త విగ్రహం బరువు 150 కిలోలు కాబట్టి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పలుమార్లు తరలించడం సాధ్యం కాదు. అందుకని దానికి ప్రత్యామ్నాయంగా చిన్న వెండి విగ్రహాన్ని సిద్ధం చేశారు. ఈ వేడుకలో అవసరమైతే ఈ వెండి విగ్రహాన్ని వైదిక ఆచారాలు నిర్వహించడానికి వీలుగా తరలిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారులు తెలిపారు.

పుష్పాలంకరణ

బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం రామజన్మభూమి ఆలయ ప్రాంగణం మొత్తాన్ని పూలతో అలంకరించారు, ప్రవేశ ద్వారం నుండి గర్భగుడి వరకు. సాయంత్రం ఘనంగా హారతి ఇవ్వడంతో రోజు వేడుకలు ముగిశాయి.

జనవరి 20 (ఉదయం): ఉదయం శరక్రధివులు, ఫలాదివాలు, సాయంత్రం పుష్పాధివాలు (పంచదార, పండ్లు, పూలు సమర్పించాలి).

జనవరి 21 (ఉదయం): మధ్యాధివాస్ (మధ్యాహ్న సెషన్), ఆ తర్వాత శైయాధివులు (దేవతను పడుకోబెడతారు).

జనవరి 22: ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం ముగింపు. మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రధాని మోదీ పూజలు చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రధాని, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొంటారు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.