వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వివిధ గ్రూప్ ఏ, బీ, సీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ మూడు కేటగిరీల్లో మొత్తం 345 పోస్ట్ లను ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు పోర్టల్ సెప్టెంబర్ 9న ఓపెన్ అయింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 30 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రైవ్ లో 345 ఖాళీలు ఉన్నాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు చూడండి
అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్): 1 ఖాళీ
అసిస్టెంట్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ కన్స్యూమర్ అఫైర్స్): 1 ఖాళీ
అసిస్టెంట్ డైరెక్టర్ (హిందీ): 1 ఖాళీ
పర్సనల్ అసిస్టెంట్: 27 ఖాళీలు
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 43 ఖాళీలు
అసిస్టెంట్ (కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్): 1 ఖాళీ
స్టెనోగ్రాఫర్: 19 ఖాళీలు
అసిస్టెంట్: 128 ఖాళీలు
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 78 ఖాళీలు
టెక్నికల్ అసిస్టెంట్ (ల్యాబొరేటరీ): 27 ఖాళీలు
సీనియర్ టెక్నీషియన్: 18 ఖాళీలు
ప్రతి పోస్టుకు అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం వేర్వేరుగా ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం బీఐఎస్ అధికారిక వెబ్ సైట్లో ఉన్న సమగ్ర నోటిఫికేషన్ ను చూడండి. దేశవ్యాప్తంగా 49 ప్రాంతాల్లోని పరీక్షా కేంద్రాల్లో ఈ నియామక పరీక్ష జరగనుంది.
అసిస్టెంట్ డైరెక్టర్ (హిందీ), అసిస్టెంట్ డైరెక్టర్ (ఫైనాన్స్), అసిస్టెంట్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు క్వాలిఫైయింగ్ పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు సాధించి తదుపరి ఎంపిక ప్రక్రియకు పరిగణనలోకి తీసుకోవాలి. టెక్నికల్ అసిస్టెంట్ (ల్యాబొరేటరీ), అసిస్టెంట్ (కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్) సీనియర్ టెక్నీషియన్, టెక్నీషియన్ పోస్టులకు సంబంధిత విభాగంలో తదుపరి ఎంపిక ప్రక్రియకు పరిగణనలోకి తీసుకోవాలంటే కనీసం 50 శాతం మార్కులు సాధించాలి.