బీజేపీ అగ్రనేత, మాజీ ఉపప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి 'భారతరత్న' ఇవ్వనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు. బీజేపీ ప్రస్తుతం ఉన్న అత్యున్నత స్థాయికి ప్రధాన కారకుల్లో ఎల్ కే అద్వానీ ఒకరు. బీజేపీలో మితవాద నాయకుడిగా ఉన్న తన సన్నిహిత మిత్రుడు వాజ్ పేయితో కలిసి ఆయన బీజేపీని దేశంలో ప్రధాన రాజకీయ శక్తిగా మలిచారు. లోక్ సభలో రెండు స్థానాలు మాత్రమే ఉన్న స్థితి నుంచి.. ఒంటరిగా ఫుల్ మెజారిటీ సాధించే స్థాయికి బీజేపీ చేరడం వెనుక అద్వానీ అచంచల కృషి చాలా ఉంది.