Rameshwaram Cafe blast: బెంగళూరు రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ నిందితుడి అరెస్ట్!-bengaluru rameshwaram cafe blast key suspect detained by nia says report ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rameshwaram Cafe Blast: బెంగళూరు రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ నిందితుడి అరెస్ట్!

Rameshwaram Cafe blast: బెంగళూరు రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ నిందితుడి అరెస్ట్!

HT Telugu Desk HT Telugu
Mar 13, 2024 01:00 PM IST

Rameshwaram Cafe blast: బెంగళూరులో సంచలనం సృష్టించిన రామేశ్వరం కేఫ్ పేలుడుకు సంబంధించి కీలకమైన ముందడుగు పడింది. ఈ నేరంలో ముఖ్యమైన అనుమానితుడిగా ఉన్న వ్యక్తిని ఎన్ఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో షబ్బీర్ అనే నిందితుడిని ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుంది.

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో పేలుడు కేసులో నిందితుడి చిత్రం
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో పేలుడు కేసులో నిందితుడి చిత్రం

Rameshwaram Cafe blast: బెంగళూరు రామేశ్వరం కేఫ్ లో జరిగిన పేలుడు కేసులో కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అదుపులోకి తీసుకుంది. కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో షబ్బీర్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. ఎన్ఐఏ అధికారులు నిందితుడు షబ్బీర్ ను విచారిస్తున్నట్లు సమాచారం.

రామేశ్వరం కేఫ్ పేలుడు

బెంగళూరులో ప్రముఖ రెస్టారెంట్ అయిన రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe blast) లో మార్చి 1న భారీ పేలుడు సంభవించింది. మొదట దీన్ని గ్యాస్ సిలండర్ పేలుడుగా భావించారు. కానీ, ఆ తరువాత, ప్రెషర్ కుక్కర్ లో పేలుడు పదార్ధాలు ఉంచి రిమోట్ తో పేల్చినట్లు నిర్ధారించారు. ఈ పేలుడుపై దర్యాప్తు చేస్తున్న అధికారులు నిందితుడిని గుర్తించారని, అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర చెప్పిన రెండు రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. నిందితుడి గుర్తింపును పరిశీలిస్తున్నామని, అతడిని త్వరలోనే పట్టుకుంటామని ఆ రోజు మంత్రి పరమేశ్వర తెలిపారు. తూర్పు బెంగళూరులోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కారిడార్ లోని బ్రూక్ ఫీల్డ్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్ లో మార్చి 1వ తేదీన ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) పేలుడు సంభవించి 10 మంది గాయపడ్డారు. ఈ కేసును బెంగళూరు పోలీసుల సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) సహకారంతో ఎన్ ఐఏ దర్యాప్తు జరుపుతోంది. పేలుడు జరిగిన ప్రాంతాన్ని ఎన్ఐఏ బృందం సందర్శించిన తర్వాత మార్చి 3న ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించారు.

10 లక్షల రివార్డు

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో జరిగిన పేలుడుకు సంబంధించి నిందితుల సమాచారం ఇచ్చిన వారికి ఎన్ఐఏ రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. ఇన్ఫార్మర్ల గుర్తింపులో గోప్యతను పాటిస్తామని ఏజెన్సీ స్పష్టం చేసింది. బెంగళూరులోని బ్రూక్ ఫీల్డ్ ప్రాంతంలోని ప్రముఖ రెస్టారెంట్ రామేశ్వరం కేఫ్ లో బ్యాగ్ ను ఉంచుతున్న సమయంలో సీసీటీవీ కెమెరా ఫుటేజీలో రికార్డయిన బాంబర్ చిత్రాన్ని కూడా ఏజెన్సీ విడుదల చేసింది. ఎన్ఐఏ విడుదల చేసిన ఫొటోలో బాంబర్ టోపీ, బ్లాక్ ప్యాంట్, బ్లాక్ షూస్ ధరించి ఉన్నాడు. అతని (బాంబర్) అరెస్టుకు దారితీసే ఏదైనా సమాచారం ఇచ్చినవారికి బహుమతి ఇస్తామని ఎన్ఐఏ ఆ పోస్టులో పేర్కొంది. మార్చి 1వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు పేలుడు సంభవించిందని, కేఫ్ లోపల బ్యాగును ఉంచిన ఓ అనుమానితుడిని సీసీటీవీ కెమెరా ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. టైమర్ తో కూడిన ఐఈడీ పరికరాన్ని పేలుడుకు ఉపయోగించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

IPL_Entry_Point