Vijay Devarakonda | తండ్రికి ఎమోషనల్‌గా బర్త్‌డే విషెస్ చెప్పిన రౌడీ హీరో-vijaya devarakonda emotional birth day wishes to his father ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Vijaya Devarakonda Emotional Birth Day Wishes To His Father

Vijay Devarakonda | తండ్రికి ఎమోషనల్‌గా బర్త్‌డే విషెస్ చెప్పిన రౌడీ హీరో

HT Telugu Desk HT Telugu
Apr 08, 2022 07:58 PM IST

విజయ్ దేవరకొండ తన తండ్రికి ఎమోషనల్‌గా పుట్టిన రోజు విషెస్ చెప్పారు. 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ భావోద్వేగంతో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం విజయ్.. పూరీ దర్శకత్వంలో లైగర్ సినిమాతో పాటు జేజీఎం చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ (twitter)

రౌడీ హీరో విజయ్ దేవరకొండ అతి కొద్దికాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. తన నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తోన్న విజయ్.. ఈ సినిమాతో పాన్ఇండియా స్టార్‌గా అవతరించనున్నాడు. అయితే అతడు ఈ స్థాయికి రావడానికి కారణం తన కుటుంబమే కారణమని చాలాసార్లు పలు వేదికలపై చెప్పాడు. ఫ్యామిలీతో ఎటాచ్‌మెంట్ ఎక్కువగా ఉండే విజయ్‌.. తాజాగా తన తండ్రి గురించి ఎమోషనల్‌గా ట్వీట్ చేశాడు. ట్విట్టర్ వేదికగా తండ్రికి భావోద్వేగంతో బర్త్‌డే విషెస్ చెప్పాడు.

"మై మెయిన్ మ్యాన్.. 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు డ్యాడీ. ఇక చాలు. ఇకపై నీ పుట్టినరోజులు జరుపుదలచుకోలేదు. సమయాన్ని ఇక్కడితో ఆపండి." అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. తండ్రికి అంతకుమించి వయస్సు పెరగకూడదని చెప్పకనే చెప్పాడు మన విజయ్. ఈ పోస్టుకు తన తండ్రితో కూడిన ఫొటోను కూడా జత చేశాడు. ఇందులో సోదరుడు ఆనంద్ దేవరకొండతో పాటు విజయ్.. తన తండ్రిని కౌగిలించుకుని ఉన్నారు. అంతేకాకుండా అతడు పెంచుకుంటున్న కుక్క కూడా ఉంది. విజయ్ పోస్టుపై నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు మన రౌడీ హీరో తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ స్పందనలను తెలియజేస్తున్నారు.

విజయ్ దేవరకొండ తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పెద్దగా పంచుకోడు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తుంటాడు. ఈ ఏడాది సంక్రాంతికి తన అభిమానులకు ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ శుభాకాంక్షలు చెప్పారు.

విజయ్ దేవరకొండ కొన్ని రోజుల క్రితమే తన కొత్త ప్రాజెక్టు గురించి ప్రకటన చేశాడు. జేజీఎం(జనగణమణ) అనే ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్నారు. వంశీ పైడిపల్లి, చార్మీ ఈ సినిమాకు నిర్మాతలు. 2023 ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం విజయ్.. పూరీతో కలిసి లైగర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టులో విడదల కానుంది. అనన్య పాండే ఇందులో హీరోయిన్.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్