Janhvi Kapoor | జాన్వీని శ్రీదేవి డాక్టర్ చేయాలనుకుందట.. మరి ఏమైంది?-sridevi want to her daughter jhanvi to became doctor ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Janhvi Kapoor | జాన్వీని శ్రీదేవి డాక్టర్ చేయాలనుకుందట.. మరి ఏమైంది?

Janhvi Kapoor | జాన్వీని శ్రీదేవి డాక్టర్ చేయాలనుకుందట.. మరి ఏమైంది?

Maragani Govardhan HT Telugu
Jan 04, 2022 10:48 AM IST

బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది. వరుస చిత్రాలు చేస్తూ ప్రేక్షకులకు చేరువైంది జాన్వీ కపూర్. తల్లి మాదిరే అందం, అభినయంపై దృష్టి పెట్టి కెరీర్ ను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తుంది. అయితే చిన్నతనం నుంచి తనను శ్రీదేవి యాక్టర్ గా చూడాలనుకులేదట. ఈ విషయాన్ని స్వయంగా జాన్వీనే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

శ్రీదేవి, జాన్వీ కపూర్
శ్రీదేవి, జాన్వీ కపూర్ (Hindustan Times)

Janhvi Kapoor.. శ్రీదేవికి దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. భాష ఏదైనా తన అందం, అభినయంతో ఒకప్పుడు ప్రేక్షకులను కట్టిపడేంది. ప్రస్తుతం ఆమె మార్గంలోనే ముద్దుల తనయ జాన్వీ కపూర్ కూడా వెళ్తోంది. బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది. వరుస చిత్రాలు చేస్తూ ప్రేక్షకులకు చేరువైంది. తల్లి మాదిరే అందం, అభినయంపై దృష్టి పెట్టి కెరీర్ ను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తుంది. అయితే చిన్నతనం నుంచి తనను శ్రీదేవి యాక్టర్ గా చూడాలనుకులేదట. ఈ విషయాన్ని స్వయంగా జాన్వీనే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

"నా చిన్నతనం నుంచి అమ్మ నన్నెప్పుడూ నటిగా చూడాలనుకోలేదు. నేను మంచి డాక్టర్ కావాలన్నిది అమ్మ కల. అయితే నేను డాక్టర్ అయ్యేంత మేధావిని కాదని గ్రహించాను. ఇదే విషయాన్ని అమ్మతో చెప్పా. దీంతో ఆమె కూడా నాకిష్టమైన సినిమాల్లో కెరీర్ ను ఎంచుకునేలా ప్రోత్సహించింది." అని జాన్వీ కపూర్ తన తల్లి ఆలోచనను పంచుకుంది.

జాన్వీ కపూర్ తొలి చిత్రం ధడక్ సెట్స్ లో ఉండగానే శ్రీదేవి మరణించింది. తెరపై తన కూతురును చూడలేకపోయింది. ధడక్ చిత్రం 2015లో మరాఠీలో విజయవంతమైన సైరత్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది. ఇది 2018లో విడుదలైంది. ఈ సినిమాలో ఇషాన్ కట్టర్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాకు శషాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సైరత్ స్థాయిలో కాకపోయినా ఓ మాదిరిగా ఆడింది. జాన్వీ కపూర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

అనంతరం ఘోస్ట్ స్టోరీస్ అనే ఆంథోలజీలో నటించింది. ఈ సిరీస్ కు జోయా అక్తర్ దర్శకత్వం వహించారు. ఈ సంవత్సరం రూహీ హారర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది కూడా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. ప్రస్తుతం వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది జాన్వీ కపూర్. వీటిలో దోస్తానా 2, గుడ్ లక్ జెర్రీ, మిల్లి లాంటి సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.

 

IPL_Entry_Point

సంబంధిత కథనం