Ram Charan fans: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుస్సా.. డైరెక్టర్ శంకర్‌ నోరు పారేసుకుంటూ..-ram charan fans furious targets director shankar no updates on game changer movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan Fans: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుస్సా.. డైరెక్టర్ శంకర్‌ నోరు పారేసుకుంటూ..

Ram Charan fans: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుస్సా.. డైరెక్టర్ శంకర్‌ నోరు పారేసుకుంటూ..

Hari Prasad S HT Telugu
Jan 31, 2024 02:57 PM IST

Ram Charan fans: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రెండు రోజులుగా గేమ్ ఛేంజర్ డైరెక్టర్ శంకర్ ను లక్ష్యంగా చేసుకుంటూ దారుణమైన ట్వీట్లు చేస్తున్నారు.

గేమ్ ఛేంజర్ మూవీ సెట్స్ లో కియారా అద్వానీ, రామ్ చరణ్
గేమ్ ఛేంజర్ మూవీ సెట్స్ లో కియారా అద్వానీ, రామ్ చరణ్

Ram Charan fans: తమ అభిమాన హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్ట్స్ మూవీ గేమ్ ఛేంజర్ పై చాలా రోజులుగా ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంపై అతని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మంగళవారం (జనవరి 30) నుంచి ఈ మూవీ డైరెక్టర్ శంకర్ ను లక్ష్యంగా చేసుకుంటూ సోషల్ మీడియా ఎక్స్ లో వందల కొద్దీ పోస్టులు చేస్తున్నారు. ఇంత వరకూ గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ డేట్ పైగానీ, మరే ఇతర అప్డేట్స్ గానీ రాని విషయం తెలిసిందే. అసలు మూవీ ఏ దశలో ఉందో కూడా తెలియడం లేదు.

రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహం ఇలా..

రెండు రోజులుగా సోషల్ మీడియా ఎక్స్ లో ఓ హ్యాష్‌ట్యాగ్ టాప్ ట్రెండింగ్స్ లో ఒకటిగా ఉంది. అదేంటో తెలుసా? #WakeUpShankarLucha.. నిజమే డైరెక్టర్ శంకర్ పై అభిమానులకు ఏ స్థాయిలో కసి ఉందో ఈ హ్యాష్‌ట్యాగ్ చూస్తే స్పష్టమవుతోంది. బాధ్యత లేని డైరెక్టర్ శంకర్, నిర్లక్ష్యపు డైరెక్టర్ శంకర్ అని కామెంట్స్ చేస్తూ ఈ హ్యాష్ ట్యాగ్ ను రామ్ చరణ్ అభిమానులు ట్రెండింగ్ లో ఉంచుతున్నారు.

శంకర్ ను ట్రోల్ చేస్తూ ఎన్నో మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. నిద్రపోతున్నావా అంటూ అతన్ని ప్రశ్నిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ మరో పూర్తిస్థాయి మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ అనౌన్స్ చేయగానే ఈ మూవీ గురించి ఓ స్థాయిలో ఊహించుకున్నారు. కానీ ఏళ్లు గడుస్తున్నా.. మూవీ గురించి ఎలా అప్డేట్ లేకపోవడం వాళ్లను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది.

అప్పుడు దిల్ రాజు.. ఇప్పుడు శంకర్

రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ మూవీపై అప్డేట్స్ లేకపోవడంపై గతంలో ఈ సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజును కూడా టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఇక ఇప్పుడు డైరెక్టర్ శంకర్ ను లక్ష్యంగా చేసుకున్నారు. నిజానికి చరణ్ తో గేమ్ ఛేంజర్ తోపాటు అటు కమల్ హాసన్ తో ఇండియన్ 2 కూడా ఒకే సమయంలో తీయడం ఈ మూవీ ఆలస్యానికి కారణంగా కనిపిస్తోంది.

ఇప్పటికే ఇండియన్ 2 షూటింగ్ పూర్తయింది. అయినా గేమ్ ఛేంజర్ పై మాత్రం ఎలాంటి కదలిక లేదు. ఫిబ్రవరి, 2021లో ఈ గేమ్ ఛేంజర్ మూవీని శంకర్ అనౌన్స్ చేశాడు. ఇప్పుడు 2024, ఫిబ్రవరి వస్తోంది. మూడేళ్లుగా మూవీ సాగుతూనే ఉంది. ఇప్పటికీ రిలీజ్ డేట్ పై ఎలాంటి సమాచారం లేదు. మూవీ షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ అయితేగానీ రిలీజ్ డేట్ పై స్పష్టత రాదని గతేడాది డిసెంబర్ లో దిల్ రాజు ఓ ప్రెస్ మీట్ లో చెప్పాడు.

డైరెక్టర్, ప్రొడ్యూసరే ఇలా గేమ్ ఛేంజర్ పై ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం ఫ్యాన్స్ ను ఒక రకమైన గందరగోళంలోకి నెట్టేస్తోంది. ప్రస్తుతం ఫిబ్రవరి నెలలోనూ ఈ మూవీ షెడ్యూల్ ఉంది. ఈ మూవీలో రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా.. దేశంలో ఎన్నికల సంస్కరణల కథాంశంతో మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్.. బుచ్చి బాబు డైరెక్షన్ లో మరో సినిమా చేయనున్నాడు.

IPL_Entry_Point