Pindam Teaser: భయపెడుతున్న పిండం టీజర్.. ఇప్పటి వరకూ ఎప్పుడూ చూడని విధంగా..
Pindam Teaser: పిండం టీజర్ భయపెడుతోంది. ఇప్పటి వరకూ ఎప్పుడూ చూడని భయపెట్టే సినిమా అనే ట్యాగ్ లైన్ తో మూవీ తీస్తున్న మేకర్స్.. టీజర్ తోనే ఆ ప్రయత్నం చేశారు.
Pindam Teaser: పిండం టీజర్ వచ్చేసింది. ఎప్పుడూ లేనంత భయపెట్టే సినిమా అంటూ మేకర్స్ చెబుతున్న ఈ మూవీ టీజర్ ను సోమవారం (అక్టోబర్ 30) రిలీజ్ చేశారు. చెప్పినట్లే కాస్త భయపెట్టడానికి ప్రయత్నించారు. ఒకరికి ఒకరు ఫేమ్ శ్రీరామ్, ఖుషీ రవి, ఈశ్వరి రావు, అవసరాల శ్రీనివాస్ నటించిన ఈ సినిమా ఆత్మల చుట్టూ తిరగనుంది.
టాలీవుడ్ లో మరో హారర్ మూవీగా రాబోతున్న పిండం సినిమాకు సాయికిరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాలాహి మీడియా బ్యానర్ కింద యశ్వంత్ దగ్గుమాటి సినిమాను నిర్మిస్తున్నాడు. నవంబర్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. టీజర్ ను బట్టి చూస్తే.. ఓ మారుమూల ఇల్లు, అందులో ఓ కుటుంబం, వాళ్లను భయపెట్టే ఆత్మ.. దీని చుట్టే కథ తిరిగినట్లు కనిపిస్తోంది.
స్కేరీయెస్ట్ ఫిల్మ్ ఎవర్ అంటూ రిలీజ్ కు ముందే ఓ బోల్డ్ ట్యాగ్ లైన్ తో మేకర్స్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ట్యాగ్ లైన్ కు తగినట్లు సినిమా ఉంటుందా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తెలియనుంది. అయితే ప్రస్తుతానికి టీజర్ మాత్రం కాస్త భయపెట్టే ప్రయత్నం చేసింది. ఆత్మలను బంధించే మంత్రగత్తె పాత్రలో ఈశ్వరి రావు ఈ సినిమాలో నటించింది.
ఇక తన కుటుంబాన్ని ఆత్మ నుంచి రక్షించుకునే పాత్రలో శ్రీరామ్ కనిపించాడు. తన జీవితంలో చూసిన అత్యంత భయంకరమైన ఆత్మ గురించి ఈశ్వరి రావు పాత్ర చెబుతుండగా.. ఈ టీజర్ ముందుకు సాగుతుంది. పిండం మూవీ మూడు టైమ్ లైన్స్ లో కనిపిస్తుంది. వర్తమానంతోపాటు 1930, 1990లలో జరిగిన కథను మేకర్స్ తెరకెక్కించారు. నిజ ఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించినట్లుగా కూడా టీజర్ లో వెల్లడించడం గమనార్హం.
టాపిక్