Pawan Kalyan Theri Remake: హరీష్-పవర్ స్టార్ సినిమా 'తేరీ'కి రీమేక్కా? ఆందోళనలో ఫ్యాన్స్
Pawan Kalyan Theri Remake: ప్రస్తుతం పవన్ కల్యాణ్ హరి హర వీర మల్లు చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ అనే మరో చిత్రం చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తమిళ చిత్రం తేరీకి రీమేక్ అని తెలుస్తోంది.
Pawan Kalyan Theri Remake: పవర్స్టార్ పవన్ కల్యాణ్ ఇటు రాజకీయాలతో పాటు అటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. క్షణం కూడా తీరిక లేకుండా రెండు రంగాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రస్తుతం ఆయన హరి హర వీర మల్లు చిత్ర షూటింగ్లో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా పూర్తి కావాల్సి ఉండగా.. పవన్ డేట్స్ కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ శివార్లలో ఈ చిత్రం కోసం భారీ సెట్ వేశారు. పవన్ కల్యాణ్ కూడా ఈ చిత్రీకరణలో పాల్గొన్నారు. ఈ చిత్రం తర్వాత ఆయన భవధీయుడు భగత్సింగ్ చేయబోతున్నారు. హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ సినిమా కోలీవుడ్ చిత్రం తేరీకి రీమేక్ అని తెలుస్తోంది.
హరీష్ శంకర్ ఇప్పటికే పవర్ స్టార్తో గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన సంగతి తెలిందే. వీరి కాంబినేషన్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే భవధీయుడు భగత్ సింగ్ అంటూ ఈ క్రేజీ ప్రాజెక్టుకు టైటిల్ కన్ఫార్మ్ చేశారు. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన తేరీ( తెలుగులో పోలీసోడు) చిత్రానికి రీమేక్ అని సమాచారం. అయితే ఈ రీమేక్పై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తేరీ రీమేక్ను చేయొద్దంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. #WeDontwantTheriRemake అనే హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు.
2016లో వచ్చిన తేరీ చిత్రంలో తలపతి విజయ్ హీరోగా చేశారు. తెలుగులో పోలీసోడు పేరుతో అనువాదమైంది. మళ్లీ అదే చిత్రాన్ని రీమేక్ చేయడంలో అర్థం లేదని అభిమానులు వాదిస్తున్నారు. పవర్ స్టార్ ను ఓ పవర్ ఫుల్ స్ట్రైట్ సినిమాలో చూడాలని కోరుకుంటున్నారు.
తాజాగా హరి హర వీర మల్లు సెట్స్లో హరీష్ శంకర్ వచ్చారు. పవన్ కల్యాణ్ను కలిసిన ఆయన.. ఆ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సినిమా సెట్స్లో హరీష్ శంకర్.. పవర్ స్టార్తో పాటు డైరెక్టర్ క్రిష్ను కూడా కలుసుకున్నారు. అంతేకాకుండా మైత్రీ మూమీ మేకర్స్ నిర్మాతలతో దిగిన ఫొటోలను షేర్ చేశారు.
మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏ ఎం రత్నం సమర్పిస్తున్న హరి హర వీర మల్లు చిత్రానికి దయాకర్ రావు నిర్మిస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా చేస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఇది విడుదల కానుంది.
సంబంధిత కథనం
టాపిక్