Pan Indian Films in September: ఒక్క నెలలోనే 4 పాన్ ఇండియా చిత్రాలు.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీనే..!
Pan Indian Films in September: టాలీవుడ్ నుంచి ఒక్క నెలలోనే నాలుగు పాన్ ఇండియా చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ప్రభాస్ సలార్ నుంచి విజయ్ ఖుషీ వరకు సెప్టెంబరులో మాసంలో ప్రతి వారం ఓ పెద్ద ప్రాజెక్టు రాబోతుంది.
చిత్రాలు పెద్దగా విడుదల కావు. కానీ ఏడాది మాత్రం భారీ చిత్రాలు రాబోతున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయి చిత్రాలు రిలీజ్ కానున్నాయి. అందులోనూ స్టార్ హీరోల సినిమాలు ఈ జాబితాలో ఉన్నాయి. వినాయక చవితి, దసరా లాంటి పండుగలు ఈ నెలలో వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద సినిమాలు సందడి చేయనున్నాయి. ఆ నెలలో ప్రతి వారం ఓ పెద్ద సినిమా రిలీజ్ కాబోతుంది. ఇందులో ప్రభాస్ దగ్గర నుంచి విజయ్ దేవరకొండ వరకు కొంతమంది స్టార్ హీరోలు తమ సినిమాలో అలరించనున్నారు.
విజయ్ ఖుషీ..
ముందుగా సెప్టెంబరు ప్రారంభంలోనే రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన ఖుషీ చిత్రం విడుదల కాబోతుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తొలుత డిసెంబరు 2022లోనే రిలీజ్ చేయాలని భావించినప్పటికీ షూటింగ్ ఆలస్యం కావడంతో అది సాధ్యం కాలేదు. ఎట్టకేలకు ఈ సినిమా 2023 సెప్టెంబరు 1న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. ఇది పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
బాలయ్య సందడి..
నందమూరి బాలకృష్ణ.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. NBK108 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతోన్న ఈ సినిమా సెప్టెంబరు 13న విడుదల కాబోతుంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా చేస్తుండగా.. శ్రీలీల కీలక పాత్రలో మెరవనుంది. ఇప్పటికే మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి బాలయ్య ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు.
నాని-మృణాల్ సినిమా..
నేచురల్ స్టార్ నాని ఇటీవలే దసరా చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత శౌర్యువ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీని సెప్టెంబరు మిడిల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా చేస్తోంది. ఈ చిత్రం కూడా పాన్ ఇండియా రేంజ్లో విడుదలయ్యే అవకాశముంది.
ప్రభాస్ సలార్..
ఇక ప్రేక్షకులకు ఆత్రుతగా ఎదురుచూస్తున్న మరో చిత్రం ప్రభాస్ సలార్. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది రాబోతున్న మోస్ట్ ఎవెయిటింగ్ ఫిల్మ్. సెప్టెంబరు 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. శృతి హాసన్ హీరోయిన్గా చేసిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాను ఇంగ్లీష్లో కూడా విడుదల చేయనున్నారు మేకర్స్. పాన్ వరల్డ్ చిత్రంగా రాబోతుంది ఈ మూవీ.