Jabardast Anchor Sowmya Rao: తెరపైకి మరో 'జబర్దస్త్‌' యాంకర్‌.. స్కిన్ షోకి సౌమ్య సై అంటుందా?-jabardast brings anchor sowmya rao in place of anasuya ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Jabardast Brings Anchor Sowmya Rao In Place Of Anasuya

Jabardast Anchor Sowmya Rao: తెరపైకి మరో 'జబర్దస్త్‌' యాంకర్‌.. స్కిన్ షోకి సౌమ్య సై అంటుందా?

HT Telugu Desk HT Telugu
Nov 07, 2022 08:00 AM IST

Jabardast Anchor Sowmya Rao: తెరపైకి మరో 'జబర్దస్త్‌' యాంకర్‌ వచ్చేసింది. ఈటీవీలో సూపర్‌ హిట్‌ అయిన జబర్దస్త్‌ కామెడీ షో నుంచి అనసూయ వెళ్లిపోవడంతో ఆమె స్థానంలో సౌమ్య రావు అనే మరో యాంకర్‌ వచ్చింది.

జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్య రావు
జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్య రావు

Jabardast Anchor Sowmya Rao: జబర్దస్త్‌.. తెలుగు బుల్లితెరపై సంచలనం సృష్టించిన కామెడీ షో. ఇందులో కమెడియన్లు చేసే కామెడీతోపాటు వారానికి రెండు రోజులు వచ్చే ఈ షోలో యాంకర్ల అందచందాలు కూడా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటాయి. చాన్నాళ్లుగా ఈ షోలో ఒక రోజు అనసూయ, మరో రోజు రష్మి గౌతమ్‌ యాంకర్లుగా చేస్తూ వస్తున్నారు.

అయితే అనసూయ సడెన్‌గా వెళ్లిపోవడంతో ఎక్స్‌ట్రా జబర్దస్త్‌తోపాటు జబర్దర్త్‌కు కూడా రష్మియే యాంకర్‌గా కొన్నాళ్లు చేసింది. కానీ ఇప్పుడు జబర్దస్త్‌కు కూడా కొత్త యాంకర్‌ వచ్చేసింది. ఆమె పేరు సౌమ్య రావు. తాజాగా ఈ కొత్త యాంకర్‌ను ఇంట్రడ్యూస్‌ చేస్తూ ఈటీవీ ఓ ప్రోమో రిలీజ్‌ చేసింది. ఇందులో షోలో జడ్జ్‌గా వ్యవహరించే ఇంద్రజ ఈ కొత్త యాంకర్‌ను ఇంట్రడ్యూస్‌ చేసింది.

ఊహించినట్లు సౌమ్య స్టేజ్‌పైకి రాగానే హైపర్‌ ఆది, ఆటో రాంప్రసాద్‌.. ఆమెతో సరసాలు ఆడటానికి ప్రయత్నించారు. అయితే సౌమ్య కూడా వాళ్లకు గట్టిగానే పంచ్‌లేసింది. అయితే రష్మిలాగే సౌమ్యకు కూడా సరిగా తెలుగు రాదు. ఎందుకంటే ఆమె కన్నడ బ్యూటీ. ఇప్పటికే ఈటీవీలోని కొన్ని సీరియల్స్‌తోపాటు తమిళంలోనూ బుల్లితెరపై నటించింది. శ్రీమంతుడు సీరియల్‌తో సౌమ్య తెలుగు వారికి దగ్గరైంది.

ఇక జబర్దస్త్‌ తొలి షోలోనే ఆమె వచ్చీరానీ తెలుగులో మాట్లాడుతూ నవ్వించింది. అంతేకాదు రష్మి అయితే ఎలా చేస్తుందో కూడా అచ్చూ అలాగే చేసి చూపించడం విశేషం. అటు రాఘవపైనా పంచ్‌ వేయడానికి ప్రయత్నించి.. అతడు వేసిన రిటర్న్‌ పంచ్‌కు అవాక్కైంది. అయితే అనసూయ, రష్మిలాగా ఈమె జబర్దస్త్‌కు గ్లామర్‌ తీసుకొచ్చే అవకాశమైతే కనిపించడం లేదు. ఎందుకంటే తాను స్కిన్‌ షోకు దూరమని గతంలోనే పలు ఇంటర్వ్యూల్లో సౌమ్య చెప్పింది.

మరోవైపు ఈ కొత్త ప్రోమో చూసిన ఫ్యాన్స్‌ మాత్రం.. ఇలా తెలుగు రాని యాంకర్లని తెలుగు కామెడీ షోకు ఎందుకు తీసుకొస్తున్నారంటూ ట్రోల్‌ చేస్తున్నారు. నిజానికి ఈ షో నిర్వాహకులు ఎంతోమంది తెలుగు మాట్లాడే యాంకర్లను సంప్రదించినా.. అందరూ కాస్త ఎక్కువ మొత్తం డిమాండ్‌ చేసినట్లు తెలిసింది. దీంతో వాళ్ల సౌమ్య రావు వైపు మొగ్గు చూపారు. సౌమ్య కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. అయితే తెలుగు, తమిళ సీనియల్స్‌తోనే పాపులర్‌ అయింది. ఈమె చేసిన ఫస్ట్‌ షో వచ్చే గురువారం (నవంబర్ 10) ఈటీవీలో టెలికాస్ట్‌ కానుంది.

IPL_Entry_Point

టాపిక్