SSMB28: మహేశ్-త్రివిక్రమ్ సినిమా నుంచి ఆసక్తికర అప్డేట్.. ఏంటంటే?-interesting update on mahesh babu and trivikram movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Interesting Update On Mahesh Babu And Trivikram Movie

SSMB28: మహేశ్-త్రివిక్రమ్ సినిమా నుంచి ఆసక్తికర అప్డేట్.. ఏంటంటే?

Maragani Govardhan HT Telugu
Jul 09, 2022 12:09 PM IST

మహేశ్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రానున్న మూడో సినిమా గురించి చిత్రబృందం ఆసక్తికర అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి కానుకుగా విడుదల చేయనున్నట్లు వీడియోను నెట్టింట షేర్ చేసింది.

మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమా
మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమా (Twitter)

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవలే సర్కారు వారి పాట చిత్రంతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా విడుదల కంటే ముందే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ చిత్రానికి ఓకే చెప్పారు. ఆ సినిమా పూజా కార్యక్రమాలు కూడా హైదారబాద్‌లో జరిగాయి. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. తాజాగా వీరి కాంబినేషన్‌లో రానున్న ఈ హ్యాట్రిక్ చిత్రానికి సంబంధించి చిత్రబృందం ఆసక్తికర అప్డేట్‌ను పంచుకుంది.

వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, ఆగస్టు రెండో వారం నుంచి సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు వెల్లడించింది.

మరోవైపు ఈ సినిమాకు సంగీత సమకూరుస్తున్న తమన్ ఈ చిత్రం గురించి ఆసక్తికర అప్డేట్‌ను ఇచ్చారు. తెల్లవారుజాము నుంచే మహేశ్-త్రివిక్రమ్ ప్రాజెక్టు కోసం వర్క్ ప్రారంభించా అంటూ పోస్ట్ పెట్టారు. చిత్రబృందం నుంచి వరుస పెట్టి ఈ విధంగా అప్డేట్లు రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మహేశ్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రానున్న మూడో చిత్రమిది. #SSMB28గా రానుంది. ఇందులో మహేశ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా చేయనుంది. ప్రిన్స్‌తో పూజ చేయనున్న రెండో సినిమా ఇది. ఇంతకుముందు వీరిద్దరూ మహర్షిలో కలిసి పనిచేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.