Amitabh Bachchan injured: ప్రాజెక్ట్ కే సెట్‌లో గాయపడిన అమితాబ్.. చిట్లిన పక్కటెముకలు.. ప్రస్తుతం ఎలా ఉందంటే?-amitabh bachchan injured during project k shoot in hyderabad ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Amitabh Bachchan Injured During Project K Shoot In Hyderabad

Amitabh Bachchan injured: ప్రాజెక్ట్ కే సెట్‌లో గాయపడిన అమితాబ్.. చిట్లిన పక్కటెముకలు.. ప్రస్తుతం ఎలా ఉందంటే?

Maragani Govardhan HT Telugu
Mar 06, 2023 10:49 AM IST

Amitabh Bachchan injured: బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ హైదరాబాద్ ప్రాజెక్ట్ కే షూటింగ్‌లో గాయపడ్డారు. సెట్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొన్న ఆయనకు ప్రమాదం జరగడంతో కుడి పక్కటెముకలు చిట్లాయి. ఈ విషయాన్ని ఆయన తన బ్లాగులో పేర్కొన్నారు.

అమితాబ్ బచ్చన్
అమితాబ్ బచ్చన్ (PTI)

Amitabh Bachchan injured: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ షూటింగ్‌లో గాయపడ్డారు. ప్రభాస హీరోగా రూపొందుతున్న ప్రాజెక్టు కే సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ఆయన గాయపడ్డారు. ఈ విషయాన్ని బిగ్‌బీ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. తన హెల్త్ అప్డేట్ గురించి తెలియజేశారు. ప్రస్తుత ముంబయిలోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు కే షూటింగ్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొన్న ఆయన గాయపడినట్లు స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తూ ఆయన కుడి పక్కటెముక కండరాలు చీలినట్లు తెలుస్తోంది. గాయం నుంచి కోలుకోడానికి కొన్ని వారాలు పడుతుందని, అప్పటి వరకు సినిమా షూటింగ్‌ను రద్దు చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.

"హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ కే షూటింగ్ యాక్షన్ షూట్‌లో నాకు గాయమైంది. మృదులాస్థి(Rib Cartilage) విరిగి కుడి పక్కటెము కండరాలు చిట్లడం వల్ల షూట్ రద్దు చేయాల్సి వచ్చింది. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో డాక్టర్‌ను సంప్రదించగా.. సీటీ స్కాన్ తీశారు. ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాను. కదిలినప్పుడు, శ్వాస తీసుకుంటున్నప్పుడు నొప్పిగా ఉంది. సాధారణంగా మారడానికి కొన్ని వారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. పరిస్థితి మెరుగుపడటానికి, నొప్పి తగ్గడానికి కొన్ని మందులు ఇచ్చారు." అని అమితాబ్ బచ్చన్ తెలిపారు.

"ఈ ప్రమాదం వల్ల చేయాల్సిన పనులన్నీ తాత్కాలికంగా నిలిపివేశాను. చికిత్స జరిగేంత వరకు షూటింగ్ రద్దు చేసుకున్నాను. నేను జల్సాలో విశ్రాంతి తీసుకుంటున్నాను. అన్ని అవసరమైన కార్యకలపాలకు మొబైల్‌తో ఎక్కువ సమయం గడుపుతాను. అయితే విశ్రాంతి కూడా తీసుకుంటాను. ఈ సాయంత్రం జల్సా గేట్ వద్దకు వచ్చే శ్రేయోభిలాషులు, అభిమానులను కలవలేను. కాబట్టి రావద్దు. రావాలనుకునే వారికి వీలైనంత వరకు ఈ సమాచారం ఇవ్వండి. అంతా ఇంక బాగానే ఉంది." అని అమితాబ్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు.

ప్రాజెక్ట్ కే ఫాంటసీ డ్రామా జోనర్‌లో తెరకెక్కుతోంది. ప్రభాస్ ఇందులో సరికొత్త రూపంల కనిపించనున్నారు. అశ్వినీ దత్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా చేస్తోంది. డార్లింగ్‌తో ఈ ముద్దుగుమ్మ తొలిసారి నటిస్తోంది. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రాజెక్ట్ కే 2024లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ మహావిష్ణువు ఆధునిక అవతారం గురించి ఈ సినిమా ఉంటుందని అశ్విని దత్ గతంలో చెప్పారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం