Srikakulam Election Fight: శ్రీకాకుళం జిల్లాలో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. సీనియర్ నాయకుడు, మంత్రి ధర్మాన ప్రసాదరావు Dharmana prasada rao ఆరోసారి ఎమ్మెల్యేగా గెలవాలని అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. శ్రీకాకుళం Srikakulam రాజకీయాల్లో గట్టి పట్టున్న ధర్మాన ఈసారి కూడా గెలుపుపై ధీమాతో ఉన్నారు. TDP తరపున గొండు శంకర్ Gondu Shankar పోటీ చేస్తున్నారు
గత ఎన్నికల ప్రచారంలో శ్రీకాకుళం నియోజక వర్గానికి వైసీపీ అధినేత పలు హామీలు ఇచ్చారు. వాటిలో కోడి రామ్మూర్తి స్టేడియం మరమ్మతులకు రూ.10 కోట్లు కేటాయిస్తానని చెప్పారు. స్టేడియం అభివృద్ధికి 2016లో టీడీపీ ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటి వరకు రూ.ఏడు కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. కాంట్రాక్టరుకు రూ.4 కోట్ల బిల్లుల చెల్లించక పోవడంతో మూడేళ్లుగా పనులు నిలిచిపోయాయి. జిల్లాకొచ్చిన జగన్ పనుల పూర్తి చేయడానికి అద నంగా రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ హామీ ప్రతిపాదనల దశలోనే ఉంది తప్ప నిధులు మాత్రం మంజూరు కాలేదు.
సంబంధిత కథనం