Stock market news today : లాభాల్లో దేశీయ సూచీలు.. నిఫ్టీ 50 పాయింట్లు జంప్​-stock market news today 24 february 2023 sensex and nifty opens on a positive note ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Stock Market News Today 24 February 2023 Sensex And Nifty Opens On A Positive Note

Stock market news today : లాభాల్లో దేశీయ సూచీలు.. నిఫ్టీ 50 పాయింట్లు జంప్​

Sharath Chitturi HT Telugu
Feb 24, 2023 09:17 AM IST

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగిశాయి.

ఇండియా స్టాక్​ మార్కెట్​
ఇండియా స్టాక్​ మార్కెట్​ (REUTERS)

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను లాభాల్లో ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 208పాయింట్లు పెరిగి 59,814 వద్ద ట్రేడ్​ అవుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 17,568 వద్ద కొనసాగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో 139 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్​.. 59,606 వద్ద ముగిసింది. 43 పాయింట్ల నష్టంతో 17,511 వద్ద స్థిరపడింది. ఇవి 2022 అక్టోబర్​ 18 కనిష్ఠాలు. ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో సెన్సెక్స్​, నిఫ్టీలు వరుసగా 59,859- 17,591 వద్ద మొదలుపెట్టాయి.

స్టాక్స్​ టు బై..

Tata Motors share price target : టాటా మోటార్స్​:- బై రూ. 433, స్టాప్​ లాస్​ రూ. 425, టార్గెట్​ రూ. 450

గెయిల్​:- బై రూ. 98, స్టాప్​ లాస్​ రూ. 96, టార్గెట్​ రూ. 104

ఈఐహెచ్​:- బై రూ. 164, స్టాప్​ లాస్​ రూ. 160, టార్గెట్​ రూ. 173

(ఇవి నిపుణుల సూచనలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు.)

లాభాలు.. నష్టాలు..

ఎస్​బీఐ, యాక్సిస్​ బ్యాంక్​, భారతీ ఎయిర్​టెల్​, బజాజ్​ ఫినాన్స్​, హెచ్​డీఎఫ్​సీ, అల్ట్రాటెక్​ సిమెంట్​, టాటా స్టీల్​, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

మారుతీ సుజుకీ, పవర్​గ్రిడ్​, సన్​ఫార్మా, హెచ్​సీఎల్​ టెక్​, ఎల్​టీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అంతర్జాతీయ స్టాక్​ మార్కెట్​లు..

US Stock market investment tips in Telugu : అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. డౌ జోన్స్​ 0.33శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500 0.53శాతం, నాస్​డాక్​ 0.72శాతం మేర లాభపడ్డాయి.

ఆసియా మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ఎర్లీ ట్రేడ్​లో జపాన్​ నిక్కీ 0.44శాతం, ఆస్ట్రేలియా ఎస్​ అండ్​ పీ 200 0.32శాతం, సౌత్​ కొరియా కాస్పి 0.26శాతం లాభపడ్డాయి.

చమురు ధరలు..

చమురు ధరలు 2శాతం పెరిగాయి. ఫలితంగా బ్యారెల్​ చమురు ధర 1.61 డాలర్లు పెరిగి 82.21 డాలర్లకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

India stock market news : గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,417.24కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,586.06కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

WhatsApp channel