Gold and silver prices today : అక్షయ తృతీయ వేళ తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి ధరలు ఇలా..-gold price today akshaya tritiya 10th may 2024 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : అక్షయ తృతీయ వేళ తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి ధరలు ఇలా..

Gold and silver prices today : అక్షయ తృతీయ వేళ తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి ధరలు ఇలా..

Sharath Chitturi HT Telugu

Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా వృద్ధిచెందాయి. ప్లాటీనం రేట్లు కూడా పెరిగాయి. అక్షయ తృతీయ వేళ మీ నగరాల్లో నేటి పసిడి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 తగ్గి.. రూ. 66,140కి చేరింది. గురువారం ఈ ధర రూ. 66,150గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 6,61,400కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 6,614గా కొనసాగుతోంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 తగ్గి.. రూ. 72,150కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 72,160గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 తగ్గి.. రూ. 7,21,500గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం పడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,290గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,300గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,140 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 72,150గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,140గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,150గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 66,140గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,150గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,140గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,150గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,190గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 72,200గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,140గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,150గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,530గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 85,300కి చేరింది. గురువారం ఈ ధర రూ. 85,200గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 88,800 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 85,300.. బెంగళూరులో రూ. 85,300గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శుక్రవారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 120 పెరిగి.. రూ 26,260కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 26,140గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,260గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

సంబంధిత కథనం