Tariff hike : ‘టారీఫ్​’ బాదుడుకు ఎయిర్​టెల్​ రెడీ! జియో మాత్రం..-airtel preparing for tariff hike jio to focus on greater data usage ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tariff Hike : ‘టారీఫ్​’ బాదుడుకు ఎయిర్​టెల్​ రెడీ! జియో మాత్రం..

Tariff hike : ‘టారీఫ్​’ బాదుడుకు ఎయిర్​టెల్​ రెడీ! జియో మాత్రం..

Sharath Chitturi HT Telugu
Mar 25, 2024 06:20 PM IST

Airtel Tariff hike : ఎయిర్​టెల్​ వినియోగదారులకు త్వరలోనే గట్టి షాక్​ తగిలే అవకాశం ఉంది! టారీఫ్​లను భారీగా పెంచేందుకు సంస్థ రెడీ అవుతోందట! జియో మాత్రం.. కొత్త స్ట్రాటజీని అప్లై చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది!

టారీఫ్​లను పెంచేందుకు ఎయిర్​టెల్​ రెడీ!
టారీఫ్​లను పెంచేందుకు ఎయిర్​టెల్​ రెడీ!

Tariff hike Airtel Jio : స్మార్ట్​ఫోన్​ వినియోగదారులపై పిడుగు! టారీఫ్​లను పెంచేందుకు ఎయిర్​టెల్​ రెడీ అవుతోందని మీడియా కథనాలు చెబుతున్నాయి. 2024 లోక్​సభ ఎన్నికల తర్వాత టారీఫ్​ హైక్​ ఉండే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నాయి. అయితే.. ఈ టారీఫ్​ విషయంలో.. రిలయన్స్​ జియో మాత్రం కొత్త స్ట్రాటజీని ప్లే చేసేందుకు ఆలోచిస్తున్నట్టు మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.

టారీఫ్​ హైక్​- ఎయిర్​టెల్​ వర్సెస్​ జియో..

ఇండియాలో లీడింగ్​ టెలికామ్​ సంస్థలుగా కొనసాగుతున్నాయి.. ఎయిర్​టెల్​, జియో. ఈ రెండింటికే.. దాదాపు 82శాతం మార్కెట్​ షేర్​ ఉంది. వొడాఫోన్​ఐడియా.. సబ్​స్క్రైబర్స్​, రెవెన్యూ పరంగా చాలా దూరంలో ఉంది. ఈ సంస్థ మార్కెట్​ షేర్​ 18.5శాతం.

కాగా.. జియో కన్నా ఎయిర్​టెల్​ టారీఫ్​లు ఇప్పటికే కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇప్పుడు.. టారీఫ్​లను పెంచేందుకు ఎయిర్​టెల్​ ప్లాన్స్​ వేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే.. టారీఫ్​ విషయంలో ఈ రెండింటి మధ్య వ్యత్యాసం మరింత పెరుగుతుంది.

Tariff hike news : మరోవైపు.. టారీఫ్​లను పెంచకుండా.. యూజర్స్​.. ఎక్కువ డేటా వాడుకునేందుకు ప్రోత్సహించాలని రిలయన్స్​ జియో భావిస్తోందట! ఇలా చేస్తే.. డేటా కన్జమ్షన్​ ఎక్కువ అవ్వడంతో పాటు రీఛార్జ్​లు కూడా పెరుగుతాయని ఆశిస్తోందట. పైగా.. ఇండియన్​ ప్రీమియం లీగ్​ కూడా నడుస్తుండటంతో.. డైటా కన్జమ్షన్స్​ కచ్చితంగా పెరుగుతుందని జియో భావిస్తోందట.

ఇటీవలి కాలంలో ఏఆర్​పీయూ (యావరేజ్​ రెవెన్యూ పర్​ యూజర్​)పై భారీగా ఫోకస్​ చేసింది ఎయిర్​టెల్​. జియో మాత్రం.. ఏఆర్​పీయూని ఫ్లాట్​గా ఉంచుతోంది. పైగా.. ఎయిర్​టెల్​ టారీఫ్​లు పెంచితే.. సబ్​స్క్రైబర్లు జియోకి షిఫ్ట్​ అవుతారని ఆశిస్తోంది.

5జీ డేటా జోరు..

Airtel Tariff hike : నివేదికల ప్రకారం.. ప్రజలు యూజర్​ ఎక్స్​పీరియెన్స్​పై ఫోకస్​ చేశారు. అందుకే.. 5జీ ప్యాక్స్​లో ఎక్కువ డబ్బులు ఉన్న రీఛార్జ్​ ప్లాన్స్​ని ఎంచుకుంటున్నారు! అదే సమయంలో.. జియోఫైబర్​ బ్రాడ్​బ్యాండ్​ ప్లాన్స్​పైనా చాలా మంది ఫోకస్​ చేస్తున్నారు.

"ఎక్కువ ధరలు ఉన్న 5జీ ప్యాక్స్​ని యూజర్స్​ ఆప్ట్​ చేసుకుంటున్నారు. ఫైబర్​ ప్లాన్స్​ కూడా లాభదాయకంగా ఉన్నాయని వారికి అర్థమవుతున్నాయి. ఇతర కంపెనీల నుంచి యూజర్స్​ కూడా వస్తున్నారు. ఫలితంగా.. హెడ్​లైన్​ టారీఫ్​ హైక్​ చేయకపోయినా.. మా ఏఆర్​పీయూ పెరుగుతుందని ఆశిస్తున్నాము," అని జియో ఎగ్జిక్యూటివ్స్​ చెబుతున్నారు.

ఎనలిస్ట్​ల ప్రకారం.. హోం బ్రాడ్​బ్యాండ్​ విషయంలో జియో వేగంగా వృద్ధిచెందుతోంది. ఇయర్​ ఆన్​ ఇయర్​లో 37.6శాతం పెరిగింది. అదే సమయంలో.. ప్రో-యాక్టివ్​ చర్యలు చేపట్టిన ఎయిర్​టెల్​.. ఏఆర్​పీయూని నెలకు రూ. 200 కన్నా ఎక్కువ స్థాయికి తీసుకెళ్లింది.

Jio Tariff hike news : ప్రస్తుతం.. ఎయిర్​టెల్​ టారీఫ్​ రూ. 208గా ఉంది. రిలయన్స్​ జియోకి అది రూ. 182గాను, వొడాఫోన్​ఐడియాకు రూ. 145గాను ఉన్నాయి. అంటే.. టారీఫ్​ల విషయంలో ఎయిర్​టెల్​ ముందు వరుసలో ఉంది.

ఇక ఇప్పుడు.. 2024 లోక్​సభ ఎన్నికలు ముగిసిన తర్వాత, జులై సమయంలో ఎయిర్​టెల్​ టారీఫ్​లను పెంచొచ్చు. ఎంత పెంచుతుంది? అంటే.. కనీసం 15శాతం హైక్​ ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం