Tiruchanoor: వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు-tiruchanoor padmavathi ammavari annual vasanthostavam photos 2023 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tiruchanoor: వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

Tiruchanoor: వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

Published May 07, 2023 07:53 AM IST HT Telugu Desk
Published May 07, 2023 07:53 AM IST

  • Vasanthostavam at Tiruchanoor 2023: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు వైభవంగా ముగిశాయి.  వసంతోత్సవాన్ని పురస్కరించుకుని.. పలు సేవలను రద్దు చేశారు అధికారులు. మహాపూర్ణాహుతితో అమ్మవారి వసంతోత్సవాలు పూర్తి అయ్యాయి.

చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఊరేగింపుగా శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. 

(1 / 6)

చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఊరేగింపుగా శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. 

(facebook)

మధ్యాహ్నం 2-30  గంటల నుండి స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, పండ్లరసాలతో అభిషేకం చేశారు.

(2 / 6)

మధ్యాహ్నం 2-30  గంటల నుండి స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, పండ్లరసాలతో అభిషేకం చేశారు.

(facebook)

రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవింద రాజన్, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, అర్చకులు బాబుస్వామి, సూప‌రింటెండెంట్ శ్రీ శేష‌గిరితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

(3 / 6)

రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవింద రాజన్, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, అర్చకులు బాబుస్వామి, సూప‌రింటెండెంట్ శ్రీ శేష‌గిరితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

(facebook)

వసంత ఋతువులో మేషరాశిలో సూర్యుడు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాడు. సూర్యకిరణాల వేడి వల్ల జీవులకు వ్యాధి బాధలు కలుగుతాయి. లోకమాత అయిన శ్రీ పద్మావతి అమ్మవారిని వసంతోత్సవాల ద్వారా ఆరాధించడం వల్ల శారీరక, మానసిక తాపాలు తొలగుతాయని భక్తులు నమ్ముతారు.

(4 / 6)

వసంత ఋతువులో మేషరాశిలో సూర్యుడు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాడు. సూర్యకిరణాల వేడి వల్ల జీవులకు వ్యాధి బాధలు కలుగుతాయి. లోకమాత అయిన శ్రీ పద్మావతి అమ్మవారిని వసంతోత్సవాల ద్వారా ఆరాధించడం వల్ల శారీరక, మానసిక తాపాలు తొలగుతాయని భక్తులు నమ్ముతారు.

(facebook)

వసంతోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అమ్మవారి ఉత్సవర్లను ఆలయం నుండి శుక్రవారపు తోటకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. 2.30 నుండి 4.30 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.

(5 / 6)

వసంతోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అమ్మవారి ఉత్సవర్లను ఆలయం నుండి శుక్రవారపు తోటకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. 2.30 నుండి 4.30 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.

(facebook)

భక్తులు ఒక్కొక్కరు రూ.150 చెల్లించి ఒక రోజు వసంతోత్సవంలో పాల్గొనేలా అధికారులు అవకాశం కల్పించారు. వసంతోత్సవం కార‌ణంగా పలు సేవలు రద్దు అయ్యాయి. 

(6 / 6)

భక్తులు ఒక్కొక్కరు రూ.150 చెల్లించి ఒక రోజు వసంతోత్సవంలో పాల్గొనేలా అధికారులు అవకాశం కల్పించారు. వసంతోత్సవం కార‌ణంగా పలు సేవలు రద్దు అయ్యాయి.
 

(facebook)

ఇతర గ్యాలరీలు