అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 15 మందికి గాయాలు-road accident at peddavadugur in anantapur district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Road Accident At Peddavadugur In Anantapur District

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 15 మందికి గాయాలు

HT Telugu Desk HT Telugu
Apr 01, 2022 06:03 AM IST

అనంతపుర జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. 15 మంది గాయపడ్డారు.

అనంతపుర జిల్లాలో ఘోర ప్రమాదం
అనంతపుర జిల్లాలో ఘోర ప్రమాదం

అనంతపుర జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఆగిఉన్న లారీని బస్సు ఢీకొట్టడటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతకు లారీలో ఉన్న ఇద్దరు, బస్సులోని వ్యక్తి అక్కడికక్కడే చనిపోయారు.

ఈ ప్రమాదంలో మరో 15 మంది గాయపడ్డారు. తీవ్రగాయాలైన ఆరుగురిని అనంతపురంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు.

IPL_Entry_Point

టాపిక్