అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నూతన ఎన్డీయే ప్రభుత్వ తొలి కేబినెట్ సమావేశం ఈ నెల 24న జరగనుంది. ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ, బీజేపీ, జనసేన ఉన్నాయి.
సచివాలయంలోని మొదటి బ్లాక్ లో సోమవారం ఉదయం 10 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభమవుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ శనివారం ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు.
క్యాబినెట్ సమావేశానికి అన్ని శాఖలు తమ ఎజెండాను సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శుక్రవారం ఆదేశించారు.
25 మంది సభ్యులున్న కేబినెట్లో 17 మంది కొత్తవారు, 8 మంది అనుభవజ్ఞులైన మంత్రులు ఉన్నారు. (పీటీఐ)