
గ్రామ పంచాయతీ పరిపాలన వ్యవస్థలో కొత్త సంస్కరణలు రానున్నాయి. ఇందులో భాగంగా ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసింది. నాలుగు గ్రేడ్లుగా పంచాయతీల పునర్ వ్యవస్థీకరణ చేయనున్నారు. పంచాయతీరాజ్ లో ప్రత్యేకంగా ఐటీ విభాగం ఏర్పాటు కానుంది.