Ram Gopal Varma: షూటింగ్‌లో ఉన్నా.. వారం తర్వాత విచారణకు వస్తానని కబురు పంపిన రాంగోపాల్‌ వర్మ-director ram gopal varma seeks more time to appear for probe before andhra police ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ram Gopal Varma: షూటింగ్‌లో ఉన్నా.. వారం తర్వాత విచారణకు వస్తానని కబురు పంపిన రాంగోపాల్‌ వర్మ

Ram Gopal Varma: షూటింగ్‌లో ఉన్నా.. వారం తర్వాత విచారణకు వస్తానని కబురు పంపిన రాంగోపాల్‌ వర్మ

Ram Gopal Varma: సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారంలో విచారణకు హాజరు కావడానికి మరికొంత సమయం కావాలని దర్శకుడు రాంగోపాల్ వర్మ కోరారు. తన లాయర్‌తో మద్దిపాడు పోలీసులకు లేఖను పంపారు. దీనిపై పోలీసులు ఇంకా స్పందించలేదు.

షూటింగ్‌లో ఉన్నాను, వారం రోజులు గడువివ్వాలని పోలీసుల్ని కోరిన ఆర్జీవి

Ram Gopal Varma: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వారి కుటుంబ సభ్యుల ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేశారన్న ఆరోపణలపై విచారణకు హాజరయ్యేందుకు మరింత సమయం కావాలని సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ పోలీసులను కోరారు.

ప్రకాశం జిల్లాకు చెందిన పోలీసు బృందం ఇటీవల హైదరాబాద్ లోని వర్మ జూబ్లీహిల్స్ నివాసానికి వెళ్లి ఈ నెల 19న విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. డైరెక్టర్ రామ్‌గోపాల్‌ వర్మ విచారణకు హాజరు కాలేదని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు.

రామ్ గోపాల్ వర్మ ముందస్తుగా సినిమా షూటింగులో బిజీగా ఉన్నందున విచారణకు హాజరు కావడానికి మరో నాలుగైదు రోజులు సమయం కావాలని తన న్యాయవాది ద్వారా లిఖితపూర్వక వినతి పత్రం పంపారని దామోదర్ తెలిపారు. పోలీసులకు సహకరించేందుకు వర్మ సుముఖత వ్యక్తం చేసినట్లు ఎస్పీ తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వర్మ తన లాయర్ ను స్థానిక సర్కిల్ ఇన్ స్పెక్టర్ వద్దకు పంపించాడు. దర్శకుడి అభ్యర్థన నిజమో, అబద్ధమో పోలీసులు పరిశీలించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారని, సాధారణంగా ఒకటి లేదా రెండు రోజులు ఎక్కువ సమయం ఇస్తారని దామోదర్ తెలిపారు.

అయితే, ఈ అభ్యర్థన అవాస్తవమని, ఉద్దేశపూర్వకంగా విచారణ నుంచి తప్పించుకునే ఎత్తుగడ అని తేలితే వర్మ కోసం ప్రత్యేక బృందాన్ని పంపడానికి పోలీసులు వెనుకాడరని ఆయన అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు నాయుడు, కళ్యాణ్ తదితరుల మార్ఫింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే ఆరోపణపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో నవంబర్ 11న ప్రముఖ దర్శకుడిపై కేసు నమోదైంది.

మద్దిపాడుకు చెందిన రామలింగం (45) అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సీఎం, డిప్యూటీ సీఎం, వారి కుటుంబ సభ్యుల ప్రతిష్టకు భంగం కలిగించేలా, వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని రామలింగం కేసు నమోదు చేశారు. దర్యాప్తులో ఈ నేరాలకు సంబంధించిన వివరాలు బయటకు వస్తాయని పోలీసులు తెలిపారు. ఆర్జీవీ షూటింగ్‌ పనుల్లో బిజీగా ఉండటంతో వారం రోజులు గడువు కోరినట్టు అతని తరపు లాయర్ సురేష్ తెలిపారు.