స్వర్ణాంధ్ర విజన్ మేనేజ్మేంట్ యూనిట్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ(ఏపీఎస్డీపీఎస్) ప్రకటన జారీ చేసింది. మొత్తం 24 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వీటిని రిక్రూట్ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఇందుకు సెప్టెంబర్ 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటి/సంస్థ నుంచి సంబంధిత విభాగంలో ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం కూడా తప్పనిసరి. స్క్రీనింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. http://www.apsdps.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎంపికైన వారు విజయవాడలో పని చేయాల్సి ఉంటుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 40 ఏళ్ల లోపు(01.01.2025) ఉండాలి. సంబంధిత విభాగంలో మూడేళ్లు పని చేసిన అనుభవం ఉండాలి. ఎంపికైన వారికి నెల జీతం రూ. 60 వేలుగా ఉంటుంది. మంచి కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఉండాలి.