YSR Cheyutha Status : 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలను స్వావలంబనగా ఏటా వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఆర్థిక సాయం అందిస్తున్నారు. చేయూత చెల్లింపు స్టేటస్ చెక్ చేసుకునే ప్రక్రియను ప్రభుతం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న, ఇప్పటికే చేయూత చెల్లింపులు అందుకున్న వారు తమ స్టేటస్ తెలుసుకునేందుకు ఆన్లైన్లోనే ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. అప్లికేషన్ స్టేటస్ని తనిఖీ చేసే ప్రక్రియను అధికారులు సులభతరం చేశారు. ఇప్పుడు మహిళలు కూడా ఈ పద్ధతి ద్వారా సులువుగా వారి చెల్లింపుల స్టేటస్ను తనిఖీ చేయవచ్చు.
ఈ పథకం ద్వారా అందించే ఆర్థిక సహాయాన్ని అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. వైఎస్ఆర్ చేయూత నాలుగో దశ చెల్లింపు స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. ఏపీ మహిళా సంక్షేమ శాఖ వైఎస్ఆర్ చేయూత స్టేటస్ తనిఖీ ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించింది. మహిళ సాధికారత పథకాల్లో వైఎస్ఆర్ చేయూత ఒకటి. దీని కింద మహిళలు వ్యాపారాలు చేసుకునేందుకు ప్రభుత్వం ఏటా రూ.18 వేలు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఆర్థిక పరిస్థితి సరిగా లేని మహిళలు మాత్రమే ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కింద ఇచ్చే ప్రయోజనాలను 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మహిళలు అర్హులు. ప్రతి మహిళకు ఏడాదికి రూ.18,000 అందిస్తారు.
నాలుగో విడత చెల్లింపుల స్టేటస్ చెక్ లింక్ సోమవారం అందుబాటులోకి వచ్చింది. నాలుగో విడతలో ప్రతి లబ్ధిదారునికి రూ.18,750 ఇచ్చారు. నాలుగేళ్లలో అర్హులైన లబ్ధిదారులకు రూ.75 వేలు సహాయం అందించారు. ఈ సహాయం అందుకోని మహిళలు వీలైనంత త్వరగా వారి చెల్లింపు స్టేటస్ను తనిఖీ చేయాలి. స్టేటస్ను తనిఖీ చేసేందుకు అధికారిక వెబ్సైట్ https://ahd.aptonline.in అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో మహిళలు తమ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, లేదా బెనిఫిషియరీ కోడ్ని ఉపయోగించి స్టేటస్ తెలుసుకోవచ్చు. అర్హులైన మహిళల కోసం అధికారిక వెబ్సైట్ https://gsws-nbm.ap.gov.inని కూడా అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఈ వెబ్సైట్ మహిళలకు చెల్లింపు స్టేటస్ను తనిఖీ చేసే సౌకర్యాన్ని అందిస్తుంది.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు