TSPSC Exam Results : టీఎస్పీఎస్సీ నుంచి మరో అప్డేట్ ... ఆ రెండు పరీక్షల 'కీ'లు విడుదల
11 February 2024, 7:03 IST
- TSPSC Latest News: మరో రెండు పరీక్షల తుది ‘కీ’లను ప్రకటించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. గతేడాది నిర్వహించిన టీపీబీవో, వెటర్నరీ సర్జన్ కీలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది.
ఫైనల్ కీ విడుదల
TSPSC Exams Updates: కొత్త పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు కావటంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ స్పీడ్ అందుకుంటోంది. ఇటీవలే గ్రూప్ 4 ర్యాంకింగ్ ఫలితాలను ప్రకటించగా… తాజాగా మరో అప్డేట్ ఇచ్చింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. గతేడాది నిర్వహించిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ (టీపీబీవో),వెటర్నరీ సర్జన్ పరీక్షలను ఫైనల్ కీలను విడుదల చేసింది. కమిషన్ అధికారిక https://www.tspsc.gov.in వెబ్ సైట్ లో కీ లను చూసుకోవచ్చని పేర్కొంది.
గతేడాది జూలై 7వ తేదీన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్షను నిర్వహించింది టీఎస్పీఎస్సీ. జూలై 13 నుంచి 15 వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించింది. నిపుణుల కమిటీతో చర్చించిన తర్వాత ఫైనల్ కీని విడుదల చేసింది. వెటర్నరీ సర్జన్ ఉద్యోగాల పరీక్షను గతేడాది జూలై 13, 14 తేదీల్లో నిర్వహించింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలను పరిశీలించింది తుది కీని విడుదల చేసింది. త్వరలోనే ఈ రెండు పరీక్షల ఫలితాలను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది.
ఇలా చెక్ చేసుకోండి…
అభ్యర్థులు మొదటగా కమిషన్ వెబ్ సైట్ https://www.tspsc.gov.in లోకి వెళ్లాలి.
డౌన్లోడ్ కీ, రెస్పాన్స్ షీట్ ఆఫ్ VAS అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
TSPSC ID, పుట్టినతేదీ, హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
గెట్ డేటా పై క్లిక్ చేస్తే ఫైనల్ కీతో పాటు రెస్పాన్స్ షీట్ ఓపెన్ అవుతుంది.
పై మాదిరిగానే టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఫైనల్ కీతో పాటు రెస్పాన్స్ షీట్ ను పొందవచ్చు.
గ్రూప్ 4 ఫలితాలు
ఇటీవలే తెలంగాణ గ్రూప్-4 ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు (TSPSC Group 4 Results) విడుదలయ్యాయి. ఈ మేరకు ర్యాంకుల వివరాలను ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్. అధికారిక వెబ్సైట్లో ర్యాంకులను అందుబాటులో ఉంచామని పేర్కొంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఎంపికైన వారి వివరాలను త్వరలో వెల్లడిస్తామని కమిషన్ తెలిపింది. గ్రూప్-4 నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 8,180 ఉద్యోగాల భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం 7,26,837 మంది ర్యాంకులను ప్రకటించింది. ఇందులో ధ్రువపత్రాల వెరిఫికేషన్కు ఎంపికైన వారి వివరాలు త్వరలో వెల్లడించనుంది టీఎస్పీఎస్సీ.
రాష్ట్రంలో 8,180 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ గ్రూప్ - 4 నోటిఫికేషన్ ఇవ్వగా..... జూలై 1న పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష కోసం మొత్తం 9,51,205 మంది అప్లై చేయగా....అందులో 7,62,872 మంది పేపర్ -1 రాయగా....7,61,198 మంది పేపర్ -2 పరీక్ష రాశారు.ఇక 5 నెలల క్రిందటే ఫైనల్ కీ విడుదల కాగా....గ్రూప్ -4 మెరిట్ జాబితా వివరాలను ఇవాళ విడుదల చేశారు. అనంతరం అభ్యర్థులకు ర్యాంకు కేటాయించనున్నారు. మార్కుల ఆధారంగా జిల్లాలు, జోన్లవారీగా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు గ్రూప్ 1 అభ్యర్థుల వయోపరిమితిని పెంచనున్నట్లు తెలంగాణ సర్కార్ ప్రకటించింది.