తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts E-challan Discount : వాహనదారులు… మీ పెండింగ్ చలాన్లు చెల్లించారా? డిస్కౌంట్ ఛాన్స్ కు ఇవాళే లాస్ట్ డేట్

TS e-Challan Discount : వాహనదారులు… మీ పెండింగ్ చలాన్లు చెల్లించారా? డిస్కౌంట్ ఛాన్స్ కు ఇవాళే లాస్ట్ డేట్

10 January 2024, 10:21 IST

    • Telangana e-Challan Discount Updates : పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఇప్పటికే ఈ అవకాశాన్ని భారీగా వాహనదారులు వినియోగించుకోగా… మిగిలినవారు కూడా సద్వినియోగం చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు.
ట్రాఫిక్ చలాన్లపై రాయితీ
ట్రాఫిక్ చలాన్లపై రాయితీ (Twitter)

ట్రాఫిక్ చలాన్లపై రాయితీ

Telangana e-Challan Discount News: వాహనదారులు మీ పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు చెల్లించారా..? అలా చేయకపోతే వెంటనే క్లియర్ చేసుకోండి. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రాయితీ గడువు ఇవాళ్టి(జనవరి 10)తో ముగియబోతుంది. డిస్కౌంట్ ఛాన్స్ తో పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవచ్చని... గడువు ముగిస్తే అలాంటి అవకాశం ఉండదని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ఇంకా ఎవరైనా చెల్లించకుంటే... ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Mallareddy Land Issue : సుచిత్రలో భూవివాదం- అల్లుడు, అనుచరులతో కలిసి మల్లారెడ్డి హల్ చల్-ఆపై అరెస్ట్!

Khammam Crime News : ఖమ్మం జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం తల్లితో పాటు ఇద్దరు కుమార్తెల హత్య

TS Govt Jobs 2024 : ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు... రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినెట్ ఖాళీలు, ముఖ్య తేదీలివే

భారీ స్పందన…

చలాన్ల రాయితీకి వాహనదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మూడు కోట్ల 59 లక్షల పెండింగ్‌ చలాన్లు ఉండగా…. ఇప్పటి వరకు 78 లక్షలకు పైగా చలాన్లు క్లియర్ చేసుకున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. శనివారం వరకు రూ. 67 ​కోట్లు వసూలైనట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్‌ కమిషరేట్‌లో రూ. 18 కోట్లు, సైబరాబాద్‌ కమిషనరేట్‌లో రూ. 14 కోట్లు, రాచకొండ కమిషనరేట్‌లో రూ. 7.15 కోట్ల చెల్లింపులు జరిగినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు.

హైదరాబాద్ నగరంలోని రాచకొండ,హైదరాబాద్,సైబరాబాద్.... మూడు కమిషనరేట్లతో పాటు రాష్ట్రంలోని ఇతర కమిషనరేట్ లు, జిల్లా ప్రధాన కార్యాలయాలు మొదలు అన్నీ పట్టణంలో పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను పాటించని వాహనదారులకు చలాన్లను విధిస్తారు.సీసీ కెమెరాల ఆధారంగా రూల్స్ అతిక్రమించిన వారి పై చర్యలు తీసుకుంటారు. తప్పనిసరిగా కొందరి నుంచి చలాన్లను వసూలు చేస్తున్న చాలా మంది మాత్రం చలాన్లను తిరిగి చెల్లించడం లేదు. ఇటీవల కాలంలో పెండింగ్ చలాన్లు పెద్ద సంఖ్యలో చెల్లించకుండా ఉండటంతో పెండింగ్ చలాన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. కొవిడ్ కారణంగా వెహికల్స్ ఓనర్స్ పెండింగ్ చలాన్లు చెల్లించపోయారు. కొన్ని వెహికల్స్ పై వాటి వ్యాల్యూ కంటే ఎక్కువ మొత్తం లో చలాన్లు ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్లతోపాటు తెలంగాణ వ్యాప్తంగా వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై కొద్దిరోజుల కిందట తెలంగాణ సర్కార్ రాయితీని ప్రకటించింది.

ఇక గత సంవత్సరం కూడా ఈ అవకాశాన్ని కల్పించింది సర్కార్. చాలా మంది వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కేవలం 40 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వానికి చలాన్ల ద్వారా రూ.300 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. తాజాగా మరోసారి అవకాశం ఇవ్వటంతో… పెండింగ్ చలాన్లు భారీ సంఖ్యలో క్లియర్ అవుతున్నాయి. ప్రభుత్వానికి రాబడి రానుంది.

తాాజాగా తెలంగాణ సర్కార్ పేర్కొన్న రాయితీల ప్రకారం… https://echallan.tspolice.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి చలాన్లను క్లియర్ చేసుకోవచ్చు. Vehicle Number ను ఎంట్రీ చేసి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు సూచిస్తున్నారు.

రాయితీ వివరాలు:

టూ వీలర్స్‌, త్రీ వీలర్స్ - 80 శాతం రాయితీ.

లైట్ / హెవీ మోటర్ వెహికల్స్ పై - 50 శాతం రాయితీ.

ఆర్టీసీ బస్సులపై - 90 శాతం రాయితీ.

తదుపరి వ్యాసం