తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Traffic Challan Deadline: నేటితో ముగియనున్న ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు.. పొడిగింపు లేదంటున్న పోలీసులు

Traffic Challan Deadline: నేటితో ముగియనున్న ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు.. పొడిగింపు లేదంటున్న పోలీసులు

Sarath chandra.B HT Telugu

16 February 2024, 8:42 IST

    • Traffic Challan Deadline: తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు రాయితీ గడువు  నేటితో ముగియనుంది. మరోమారు పొడిగింపు ఉండదని పోలీసులు ప్రకటించారు. 
నేటితో ముగియనున్న  ట్రాఫిక్ చలాన్లపై రాయితీ గడువు
నేటితో ముగియనున్న ట్రాఫిక్ చలాన్లపై రాయితీ గడువు (Twitter)

నేటితో ముగియనున్న ట్రాఫిక్ చలాన్లపై రాయితీ గడువు

Traffic Challan Deadline: తెలంగాణలో ట్రాఫిక్‌ చలాన్ల చెల్లింపుకు రాయితీ Discount గడువు నేటితో ముగియనుంది. గత ఏడాది రాయితీతో పెండింగ్‌ చలాన్ల చెల్లింపుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాహనదారుల విజ్ఞప్తి మేరకు పలుమార్లు గడువు Deadlineతేదీ పొడిగిస్తూ వచ్చారు. తాజా గడువు నేటితో ముగియనున్నట్లు పోలీసు శాఖ స్పష్టం చేసింది. వాహనాల పెండింగ్ చలాన్స్ రాయితీ గడువు నేటి అర్థరాత్రితో ముగియనుంది.

వాహనాల పెండింగ్‌ చలాన్లకు Pending Challans రాయితీ ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు రూ.147 కోట్ల వసూళ్లు జరిగాయి. నేటి రాత్రి 11.59 గంటలకు చెల్లింపు గడువు ముగియనుందని పోలీసులు వెల్లడించారు. మరోసారి గడువు పెంచే అవకాశం దంటున్నారు.

తెలంగాణ పోలీస్ TS Police శాఖ రాయితీ అవకాశం కల్పించిన తర్వాత దాదాపు కోటి 66 లక్షల పెండింగ్ చలాన్స్ క్లియర్ అయ్యాయి. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా 3కోట్ల 59లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు కోటి 66 లక్షల కేసులు క్లియర్ అయినట్లు పోలీసులు వెల్లడించారు. నిబంధనల ఉల్లంఘించిన వాహనాల్లో 47 శాతం కేసులు క్లియర్ అయ్యాయని, ఇంకా 53 శాతం పెండింగ్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.

వాహనాల జరిమానా Penalty చెల్లింపు గడువును ఇప్పటికే రెండుసార్లు పొడిగించారు. మొదట జనవరి 10ని ట్రాఫిక్ చలాన్ల డిస్కౌంట్‌కు చివరి తేదీగా నిర్ణయించగా.. ఆ తరువాత జనవరి 31 వరకు, మరోసారి ఫిబ్రవరి 15 వరకు పొడిగించారు. ఆ గడువు నేటితో ముగియనుంది. అయితే మరోసారి గడువు పెంచే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు.

ఇప్పటి వరకు కోటి 66 లక్షల పెండింగ్‌ చలాన్ల క్లియరెన్స్‌తో రూ.147 కోట్లు వసూలు అయినట్లు అధికారులు తెలిపారు. గత జనవరి 31న వాహనదారుల పెండింగ్ చలాన్ల రాయితీ గడువును తెలంగాణ ప్రభుత్వం రెండో సారి పొడిగించింది.

రాయితీపై చలాన్లు చెల్లింపును ఫిబ్రవరి 15 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే డిసెంబర్ 25 వరకు పెండింగ్ లో చలాన్లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలాన్లు ఉండగా, వీటిల్లో 40 శాతం చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ చలాన్లతో జనవరి 31 వరకు ప్రభుత్వానికి రూ.135 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని తెలుస్తోంది.

గత ఏడాది డిసెంబర్ 27వ పెండింగ్ చలాన్లపై రాయితీ ప్రకటించింది ప్రభుత్వం. టూ, త్రీ వీలర్స్ వాహనాలపై 80 శాతం, లైట్, హెవీ మోటార్ వెహికల్స్ పై 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం రాయితీ ప్రకటించింది. జనవరి 10 వరకు చలాన్ల చెల్లింపునకు గడువు ఇచ్చింది. ఆ తర్వాత జనవరి 31 వరకు గడువు పొడిగించింది. తాజాగా ఈ గడువు నేటితో ముగుస్తున్నట్లు ప్రకటించారు.

హైదరాబాద్ నగరంలోని రాచకొండ,హైదరాబాద్,సైబరాబాద్.... మూడు కమిషనరేట్లతో పాటు రాష్ట్రంలోని ఇతర కమిషనరేట్ లు, జిల్లా ప్రధాన కార్యాలయాలు మొదలు అన్నీ పట్టణంలో పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను పాటించని వాహనదారులకు చలాన్లను విధిస్తారు.

సీసీ కెమెరాల ఆధారంగా రూల్స్ అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటారు. తప్పనిసరిగా కొందరి నుంచి చలాన్లను వసూలు చేస్తున్న చాలా మంది మాత్రం చలాన్లను తిరిగి చెల్లించడం లేదు. ఇటీవల కాలంలో పెండింగ్ చలాన్లు పెద్ద సంఖ్యలో చెల్లించకుండా ఉండటంతో పెండింగ్ చలాన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. కొవిడ్ కారణంగా వెహికల్స్ ఓనర్స్ పెండింగ్ చలాన్లు చెల్లించలేకపోయారు.

కొన్ని వెహికల్స్ పై వాటి వ్యాల్యూ కంటే ఎక్కువ మొత్తంలో చలాన్లు ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్లతోపాటు తెలంగాణ వ్యాప్తంగా వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై తెలంగాణ సర్కార్ రాయితీని ప్రకటించింది.

వరంగల్ కమిషనరేట్‌లో….

రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ట్రాఫిక్ చాలాన్లు క్లియర్ చేసేందుకు ప్రభుత్వం భారీ రాయితీలు ప్రకటించింది. కాగా వరంగల్ కమిషనరేట్ పరిధిలోని హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో కలిపి దాదాపు 20 లక్షలకుపైగా చాలాన్లు పెండింగ్ లో ఉండగా.. రూ.50 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. దీంతో వరంగల్ పోలీసులు చలాన్లు క్లియర్ చేయించేందుకు స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నారు. కొంతమంది రాయితీలు వినియోగించుకునేందుకు సొంతంగా చెల్లింపులు కూడా చేశారు.

మీ సేవ, ఆన్ లైన్ ఈ-చలాన్, పేటీఎం తదితర సేవలు వినియోగించుకున్నారు. ఇలా డిసెంబర్ 26 నుంచి సంక్రాంతి పండుగ వరకు సుమారు 8 లక్షల చలాన్ల వరకు క్లియర్ కాగా.. మొత్తంగా రూ.20.31 కోట్లకుపైగా వసూలు అయ్యాయి. కేవలం 20 రోజుల్లోనే ఇంత పెద్దఎత్తున చాలాన్లు వసూలు కావడం ఇదే మొదటిసారని పోలీసులు చెబుతున్నారు.

తదుపరి వ్యాసం