తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts High Court : సింగరేణి ఎన్నికలు వాయిదా - హైకోర్టు ఆదేశాలు

TS High Court : సింగరేణి ఎన్నికలు వాయిదా - హైకోర్టు ఆదేశాలు

11 October 2023, 12:32 IST

    • TS High Court On Singareni Elections 2023: సింగరేణి ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. డిసెంబర్ 27న ఎన్నికలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
సింగరేణి ఎన్నికలు వాయిదా
సింగరేణి ఎన్నికలు వాయిదా

సింగరేణి ఎన్నికలు వాయిదా

Singareni Elections 2023: సింగరేణి ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 27కు సింగరేణి ఎన్నికలు వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. నవంబర్ 30వ తేదీ లోపు ఓటర్ లిస్ట్ రెడీ చేయాలని స్పష్టం చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Electrocution : ఉమ్మడి మెదక్ జిల్లాలో విద్యుత్ షాక్ కు గురై నలుగురు దుర్మరణం

IRCTC Tamilnadu Tour Package : 6 రోజుల్లో తమిళనాడులోని ప్రముఖ దేవాలయాల సందర్శన, హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ

Medak Crime News : దారుణం.. బెట్టింగ్‌ ఆడుతున్నాడని కుమారుడిని రాడుతో కొట్టి చంపిన తండ్రి

TS EAPCET 2024 Key : తెలంగాణ ఎంసెట్ అప్డేట్స్ - ఇంజినీరింగ్ స్ట్రీమ్ 'కీ' కూడా వచ్చేసింది, ఇదిగో డైరెక్ట్ లింక్

ఈ నెల 28న సింగరేణిలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర కార్మికశాఖ సిద్ధమైంది. అయితే ఇందుకు సింగరేణి యాజమాన్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సముఖంగా లేదు. ఎన్నికల నిర్వహణపై హైకోర్టును ఆశ్రయించగా…. ఎన్నికలను నిర్వహించాల్సిందేనంటూ సింగిల్ బెంచ్ ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ… హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ పిటిషన్ వేసింది సింగరేణి యాజమాన్యం. అసెంబ్లీ ఎన్నికల కారణంగా సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలని కోరింది. దీనిపై ఇవాళ విచారించిన డివిజన్ బెంచ్ ధర్మాసనం… సింగరేణి ఎన్నికలను వాయిదా వేస్తూ ఆదేశాలిచ్చింది. ఫలితంగా సింగరేణి ఎన్నికలు వాయిదా పడినట్లు అయింది.

సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణపై మొదటి నుంచి కూడా సింగరేణి యాజమాన్యం ఆసక్తి చూపలేదు. ఏదో కారణంతో వాయిదా వేసే ప్రయత్నం చేస్తోంది. చివరికి హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకే కేంద్ర కార్మిక శాఖ ఎన్నికల నిర్వహించేందుకు షెడ్యూల్​ రిలీజ్​ చేసినప్పటికీ….. యాజమాన్యం అప్పీల్​కు వెళ్లింది. అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావటంతో పాటు ప్రస్తుత పరిస్థితుల్లో సింగరేణిలో ఎన్నికలు నిర్వహించలేమని… గడువు కావాలంటూ హైకోర్టును కోరింది.

మరోవైపు కేంద్ర కార్మికశాఖ షెడ్యూల్ ​ప్రకారం… అక్టోబర్​ 6,7 తేదీల్లో సంఘాల నుంచి నామినేషన్లను కూడా స్వీకరించింది. కార్మిక సంఘాలకు ఎన్నికల గుర్తులను కేటాయించే పనిలో ఉండటంతో పాటు… ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో…. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు రావటంతో ఎన్నికల ప్రక్రియ ఆగిపోనుంది. డిసెంబర్ 27న సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి. ఆ లోపు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.

తదుపరి వ్యాసం