Sabarimala Special Trains : అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్, శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు
20 November 2023, 15:37 IST
- Sabarimala Special Trains : శబరిమల పుణ్య క్షేత్రానికి దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపనుంది. మొత్తం 22 రైళ్లను నిర్ణీత తేదీల్లో నడపనున్నారు.
శబరిమలకు ప్రత్యేక రైళ్లు
శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Sabarimala Special Trains : అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. శబరిమల క్షేత్రానికి మొత్తం 22 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్- కొల్లం, కొల్లం-సికింద్రాబాద్, నర్సాపుర్-కొట్టాయం, కాచిగూడ-కొల్లం, కాకినాడ టౌన్ -కొట్టాయం మధ్య స్పెషల్ ట్రైన్స్ ఆయా రోజుల్లో నడపనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, సెకెండ్ క్లాస్ కోచ్లు అందుబాటులో ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు
ప్రత్యేక రైళ్ల వివరాలు
- సికింద్రాబాద్-కొల్లం-సికింద్రాబాద్ (07129,07130) ప్రత్యేక రైళ్లు- నవంబర్ 26, డిసెంబర్ 3న- తిరుగుప్రయాణం- నవంబర్ 28, డిసెంబర్ 5న - నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలర్పేట్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కడ్, త్రిసూర్, ,ఆలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చెంగనస్సెరి, తిరువళ్ల, చెంగనూర్, మావెలికెర స్టేషన్లలో ఆగనున్నాయి.
- సికింద్రాబాద్ -కొల్లం-సికింద్రాబాద్(07127,07128) ప్రత్యేక రైలు- నవంబర్ 24, డిసెంబర్ 1న, తిరుగు ప్రయాణం-నవంబర్ 25, డిసెంబర్ 2న - ఈ రైలు కాచిగూడ, ఉందానగర్, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తి రోడ్, శ్రీరామ్నగర్, గద్వాల్, కర్నూలు సిటీ,డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలర్పేట్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూరు, పాలక్కాడ్, త్రిసూర్, ఆలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చెంగనస్సెరి, తిరువళ్ల, చెంగనూర్, మావెలికెర స్టేషన్లలో ఆగనున్నాయి.
- కాకినాడ టౌన్ -కొట్టాయం-కాకినాడ టౌన్ (07126, 07126) ప్రత్యేక రైళ్లు- నవంబర్ 23, 30 , తిరుగు ప్రయాణం-నవంబర్ 25, డిసెంబర్ 2- ఈ ప్రత్యేక రైళ్లు సామార్లకోట, అనపర్తి, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పడి, జోలర్పెట్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూరు, పాలక్కాడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకుళం టౌన్ స్టేషన్లలో ఆగనున్నాయి.
- నర్సాపూర్-కొట్టాయం-నర్సాపూర్(07119,07120) నవంబర్ 26, డిసెంబర్ 3, తిరుగుప్రయాణం-నవంబర్ 27, డిసెంబర్ 4- ఈ ట్రైన్ భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలర్పేట్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూరు, పాలక్కాడ్, త్రిసూర్, ఆలువా, ఎర్నాకుళం టౌన్ స్టేషన్లలో ఆగనుంది.
- కాచిగూడ-కొల్లం-కాచిగూడ (07123,07124) రైళ్లు-నవంబర్ 22, 29, డిసెంబర్ 6- తిరుగుప్రయాణం - నవంబర్ 24, డిసెంబర్ 1, 8- ఈ రైళ్లు మల్కాజ్గిరి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలర్పేట్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూరు, పాలక్కాడ్, త్రిసూర్, ఆల్వాయ్, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చెంగనాచెరి, తిరువళ్ల, చెంగనూర్, మావెలికెర స్టేషన్లలో ఆగనుంది.