తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Revanth Reddy : Brs సర్కార్‍ను రద్దు చేస్తేనే పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ

Revanth Reddy : BRS సర్కార్‍ను రద్దు చేస్తేనే పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ

24 September 2023, 6:33 IST

    • Revanth Reddy On Group 1 Exam: సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. గ్రూప్ 1  పరీక్షను మరోసారి నిర్వహించమని హైకోర్టు ఇచ్చిన తీర్పు  ప్రభుత్వానికి చెంపపెట్టు అని అన్నారు. బీఆర్ఎస్ సర్కార్ ను రద్దు చేస్తేనే ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరుగుతుందని యువతకు పిలుపునిచ్చారు.
గ్రూప్ 1 రద్దు
గ్రూప్ 1 రద్దు

గ్రూప్ 1 రద్దు

Revanth Reddy Open Letter To CM KCR: గ్రూప్-1 (ప్రిలిమినరీ) పరీక్షను మరోసారి నిర్వహించమని హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. మీ పాలనలో వ్యవస్థల విధ్వంస ప్రతిఫలిమే ఈ దుస్థితి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. న అన్యాయమైన, దుర్మార్గామైన పాలనకు విద్యార్ధులు, నిర్యుదోగుల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరించారు.

ట్రెండింగ్ వార్తలు

10 Years Telangana: ఉమ్మడి రాజధాని గడువు మరో పక్షం రోజులే.. జూన్‌2 తర్వాత ఆస్తుల స్వాధీనం చేసుకోవాలని సిఎం రేవంత్ ఆదేశం

BRS RakeshReddy: బీఆర్ఎస్ లో 'రాకేశ్ రెడ్డి' పంచాయితీ!కోఆర్డినేషన్ మీటింగ్‌ కు ముఖ్య నేతలంతా డుమ్మా

TS CPGET 2024 : టీఎస్ సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల, మే 18 నుంచి అప్లికేషన్లు ప్రారంభం

Mutton Bone Stuck : పెళ్లి విందులో మటన్ బోన్ మింగేసిన వృద్ధుడు, శస్త్ర చికిత్స చేసి తొలగించిన వైద్యులు

“తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కాకతీయ యూనివర్సిటీ వరకు విద్యార్ధులు, యువత తెలంగాణ ఉద్యమానికి అలంబనగా నిలిచారు. ఆ ఉద్యమం చల్లారకుండా తెలంగాణ రాష్ట్ర అవశ్యకతను సజీవంగా ఉండేలా చేశారు. 1952 ముల్కీ, నాన్ ముల్కీ ఉద్యమం, 1969 మొదటి దశ ఉద్యమం నుంచి 2014 వరకు జరిగిన మలి దశ వరకు జరిగిన తెలంగాణ ఉద్యమంలో యువత, విద్యార్ధులు కీలక పాత్ర పోషించారు. 2014 తెలంగాణ వచ్చినప్పటి నుంచి యువత, విద్యార్ధులకు అడుగడునా పరాభావం ఎదురవుతూనే ఉంది. ఇంటర్మీడియెట్ పేపర్ల మూల్యాంకనంలో దొర్లిన తప్పులతో 27 మంది విద్యార్ధుల ఆత్మహత్య, 2015లో సింగరేణి మొదలు, ఎంసెట్ పేపర్ లీకేజీ, విద్యుత్ సంస్థ నియామక పరీక్ష పేపర్ లీక్, పదో తరగతి పేపర్ లీకు, అక్కడి నుంచి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో మీ మోసం పరాకాష్టం చేరింది. ఇంత జరిగిన మీ ప్రభుత్వంలో చలనం లేదు. ఒక్క సమీక్ష సమావేశం నిర్వహించిన పాపాన పోలేదు” అని విమర్శించారు రేవంత్ రెడ్డి.

నీళ్లు..నిధులు..నియామకాలు నినాదంతో తెలంగాణ యువతను ఆకర్షించి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు."మీరు గడిచిన 9 ఏళ్లలో ఉద్యోగాల భర్తీ విషయంలో పదే పదే మోసం చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో 1.92 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిస్వాల్ కమిటీ నివేదిక స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఆ ఖాళీలను భర్తీ చేయాలన్నా ఆలోచన చేయ లేదు. సునీల్ నాయక్, భాషా లాంటి వందలాది మంది యువత నిరాశ నిస్పృహలకు లోనై ఆత్మహత్యలు చేసుకున్న కూడా పట్టించుకోకుండా దారుణంగా వ్యవహరించారు. మీ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ జంగ్ సైరన్ ల పేరుతో పోరాటాలు చేస్తే వాటిని కూడా పోలీసులను అడ్డుపెట్టి అణచి వేసే ప్రయత్నం చేశారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు రూ. 3,106 భృతి ఇస్తానని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని మోసం చేశారు. ఉద్యోగాలను భర్తీ చేస్తారనే ఆశతో 30 లక్షల మంది యువత నిద్రాహారాలు మాని పరీక్షలకు సిద్ధమవుతున్నారు. తల్లిదండ్రులు పంపించే చాలిచాలనీ డబ్బులతో హాస్టళ్లలో ఉండి కోచింగ్ సెంటర్లకు డబ్బులు కట్టి పరీక్షలకు ప్రిపేరవుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వంలో సోయి లేదు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

“మీ నిర్లక్ష్యం, అసమర్థత కారణంగా చోటు చేసుకున్న పేపర్ లీకేజీతో గతేడాది అక్టోబర్ 22న నిర్వహించిన గ్రూప్-1 (ప్రిలిమినరీ)కు పరీక్షను రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో 2 లక్షల 80 వేల మంది విద్యార్ధుల జీవితం ఆగమ్యగోచరంగా తయారైంది. ఇంత జరిగిన పేపర్ లీకేజీపై సరైన చర్యలు తీసుకోకుండా అందుకు కారణమైన వారిని శిక్షించకుండా ఈ ఏడాది జూన్ 11న మరోసారి గ్రూప్-1(ప్రిలిమినరీ) పరీక్ష నిర్వహించారు. తప్పులు దిద్దుకొని గత అనుభవం నుంచి ఈ సారైనా పడక్బందీగా పరీక్ష నిర్వహిస్తారానుకుంటే..మీ వక్రబుద్ధితో పరీక్ష నిర్వహణలో డొల్లతనాన్ని బయట పెట్టుకున్నారు. బయోమెట్రిక్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, హాల్ టికెట్ నెంబర్ తో ఓఎంఆర్ షీట్లు ఇవ్వడం కనీస బాధ్యత. కానీ ఘనత వహించిన పాలనలో ఇవేమీ పట్టించుకోకుండా బయోమెట్రిక్ తీసుకోకపోవడం, హాల్ టికెట్ నెంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇవ్వడం వంటి దారుణమైన తప్పులకు పాల్పడ్డారు. ఈ దుర్మార్గాలపై విద్యార్ధులు మా పార్టీ విద్యార్ధి విభాగం ఎన్ఎస్ యూఐని ఆశ్రయించారు. వారి తరపున ఎన్ఎస్ యూఐ న్యాయం పోరాటం చేసింది. ఫలితంగా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను తిరిగి నిర్వహించమని హైకోర్టు ఇచ్చిన తీర్పు మీకు చెంపపెట్టు. అంటే గ్రూప్-1 పరీక్ష నిర్వహణంలో మీ ప్రభుత్వం విఫలం చెందినట్టు కోర్టు తీర్పుతో మరోసారి స్పష్టమైంది” అని రేవంత్ రెడ్డి అన్నారు.

ఈ సర్కార్ ను రద్దు చేయాలి …

“పేపర్ల లీకేజీ స్కాం వెలుగులోకి వచ్చినప్పుడు అందుకు బాధ్యులైన ఏ ఒక్కరినీ వదలకుండా కఠినంగా చర్యలు తీసుకుంటే ఈ రోజు ఈ పరిస్థితి దాపురించేది కాదు. అప్పుడు మీరు పరీక్షలు రద్దు చేసి చేతులు దులుపుకొని తప్పు ఒకరు చేస్తే శిక్ష విద్యార్ధులకు విధించారు. ఇంతజరిగిన టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తారని, సంస్కరిస్తారనే నమ్మకం, విశ్వాసం తెలంగాణ యువత, నిరుద్యోగులకు లేదు ఈ నేపథ్యంలో తెలంగాణ యువత, నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఒక భరోసా కల్పించాలని భావిస్తోంది. తెలంగాణ విద్యార్ధులు, యువత నిరాశపడొద్దు. మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఇప్పటికే యువత, విద్యార్ధి కోసం యూత్ డిక్లరేషన్ ప్రకటించాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ప్రతి ఒక్క నిరుద్యోగికి నెలకు రూ. 4 వేల నిరుద్యోగ భృతి అందజేస్తాం. జాబ్ కాలెండర్ ప్రకటించి నిర్ణీత సమయంలోగా పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అసలు పరీక్షలు రద్దు కాదు. కేసీఆర్ సర్కారునే రద్దు చేస్తేనే ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరుగుతుంది. తెలంగాణలో న్యాయంగా ఉద్యోగ నియామకాలు జరగాలంటే కేసీఆర్ సర్కారును రద్దు చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ఏకైక మార్గం” అని రేవంత్ రెడ్డి తెలిపారు.

తదుపరి వ్యాసం