తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Reasons For Brs Defeat: ఆ పొరపాటే బిఆర్‌ఎస్ కొంప ముంచిందా?

Reasons for BRS Defeat: ఆ పొరపాటే బిఆర్‌ఎస్ కొంప ముంచిందా?

Sarath chandra.B HT Telugu

11 December 2023, 6:00 IST

    • BRS Failure reasons: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బిఆర్‌ఎస్ పార్టీ ఓటమి పాలవడానికి ఓ పొరపాటే కారణమని చెబుతున్నారు. బిఆర్‌ఎస్ నాయకత్వంలో మితిమీరిన నమ్మకంతో చేసిన పనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ప్రచారం జరుగుతోంది.
బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్
బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్

బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్

BRS Failure reasons: సాంప్రదాయాక రాజకీయాలకు చాలా కాలం క్రితమే కాలం చెల్లిపోయింది. పాలిటిక్స్‌ మొత్తం కన్సల్టెంట్ల చెప్పు చేతల్లో నడుస్తున్నాయి.గత దశాబ్ద కాలంలో పొలిటికల్ కన్సల్టెంట్ల ప్రభావం గణనీయంగా పెరిగింది. తెలంగాణలో బిఆర్ఎస్‌ పార్టీ వైఫల్యానికి ఎవరి సలహాలు తీసుకోకపోవడం కూడా ఓ కారణమని ప్రచారం జరుగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Kamareddy DMHO: కామారెడ్డిలో కామపిశాచి, వైద్యులపై వేధింపుల కేసుతో జిల్లా వైద్యాధికారి అరెస్ట్

BRS Protest: బోనస్ బోగసేనా?... రోడ్డెక్కిన బీఆర్ఎస్.. ప్రభుత్వ తీరుపై ధర్నాలు, రాస్తారోకోలతో BRS నిరసన

Graduate Mlc Election: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీపై బీజేపీ గురి, కీలక నేతలకు ఇన్‌ఛార్జి బాధ్యతలు

Warangal Rains: వరంగల్‌లో ఈదురు గాలులతో భారీ వర్షం, రైతులకు తీవ్ర నష్టం.. గ్రేటర్ లో ఆఫీసర్లు అలర్ట్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొలిటికల్ కన్సల్టెంట్ల సేవల్ని వినియోగించుకునే విషయంలో బిఆర్‌ఎస్‌ పార్టీ చేసిన చిన్న పొరపాటుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. దాదాపు ఏడాదిన్నర, రెండేళ్ల క్రితమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం గ్రౌండ్‌ ప్రిపేర్ చేసే క్రమంలో ప్రశాంత్‌ కిషోర్ బృందంతో బిఆర్‌ఎస్ అగ్ర నాయకత్వం చర్చలు జరిపింది. కొన్ని నెలల పాటు ఆ సంస్థ తెలంగాణలో అధికార పార్టీకి సేవలు కూడా అందించింది. ఏం జరిగిందో నిర్దిష్టంగా తెలియకపోయినా మూడు నాలుగు నెలలకే బిఆర్‌ఎస్‌తో బంధానికి బ్రేక్ పడింది.

ఆ తర్వాత కన్సల్టెంట్లు చెప్పే సలహాలను అమలు చేసే విషయంలో బిఆర్‌ఎస్‌ నాయకులు బహిరంగంగా ఎద్దేవా కూడా చేశారు. పొలిటికల్ కన్సల్టెంట్స్‌ ఆచరణ సాధ్యం కాని సలహాలు ఇస్తుంటారని, వాటిని పాటించలేమంటూ బిఆర్‌ఎస్ నాయకులు పబ్లిక్‌గా జోకులు సైతం వేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రశాంత్ కిషోర్ బృందం కేసీఆర్‌ ప్రభుత్వానికి ఏమి సలహా ఇచ్చిందనే విషయంలో ప్రచారం జరుగుతోంది.

మార్పులకు కేసీఆర్ ఒప్పుకోలేదా?

తెలంగాణలో బిఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా అమలు చేసిన ప్రతిష్టాత్మక పథకాల్లో డబుల్ బెడ్‌ రూమ్‌ ఇళ్ల స్కీం ఉంది. ఈ పథకం అమలుపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో దానిని మార్చాలని పికె టీమ్‌ సిఫార్సు చేసినట్లు చెబుతున్నారు.

డబుల్ బెడ్‌ రూమ్‌ ఇళ్ల బదులు ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే వ్యయాన్ని నేరుగా లబ్దిదారుడికి అందించేలా మార్చాలని సూచించినట్టు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ గ్రాంటుతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సాయాన్ని కలిపి నేరుగా కలిపి లబ్దిదారుడికి ఇస్తే ఎక్కువ ప్రయోజనంతో పాటు సానుకూల ఫలితాలు ఉంటాయని సూచించినట్టు తెలుస్తోంది.

దీంతో పాటు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో పలు సంస్కరణలను ఐ పాక్‌ ప్రతిపాదించడం వాటికి కేసీఆర్ సర్కారు నిరాకరించినట్టు చెబుతున్నారు. దీంతో పాటు తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం, సిట్టింగ్ ఎమ్మెల్యేలో 45-50మందిని మార్చడం వంటి సిఫార్సులు చేసినట్టు తెలుస్తోంది.

ఆర్ధిక ఇబ్బందులు, ఇతర కారణాలతో విధాన పరమైన నిర్ణయాల్లో మార్పులు చేయడానికి కేసీఆర్ నిరాకరించడంతో కన్సల్టెన్సీ బాధ్యతల నుంచి ఐపాక్ తప్పుకున్నట్టు చెబుతున్నారు. ఆ తర్వాత మరో సంస్థను డిజిటల్ కాంపెయినింగ్‌ కోసం బిఆర్‌ఎస్ ప్రభుత్వం నియమించుకున్నా ఆశించిన ఫలితాలు రాలేదని చెబుతున్నారు.

అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున సునీల్ కనుగోలు పనిచేశారు. మిగిలిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాకపోయినా తెలంగాణలో మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతను పెంచడంలో కన్సల్టెంట్లు కీలక పాత్ర పోషించారు. ఓ దశలో కాంగ్రెస్ పార్టీ వార్‌రూమ్‌పై పోలీసులు దాడి చేయడంతో దానిని బెంగుళూరుకు మార్చి కార్యకలాపాలు నడిపించారు.

ఎన్నికలు ముగిసే వరకు సునీల్ బృందం బెంగుళూరు నుంచి హైదరాబాద్ వ్యవహారాలు నడిపించింది. అదే సమయంలో బిఆర్‌ఎస్ నియమించుకున్న స్ట్రాటజీ బృందం ప్రత్యర్ధుల ప్రచారాలను తిప్పి కొట్టడంలో వెనుకబడిపోయారు. సోషల్ మీడియా కాంపెయినింగ్‌లో ప్రభుత్వ ప్రచారాలకు మాత్రమే అవి పరిమితం అయినట్టు చెబుతున్నారు. ఫలితంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ఓటమి మూటగట్టుకోవాల్సి వచ్చిందని విశ్లేషిస్తున్నారు.

తదుపరి వ్యాసం