తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Crime: చౌటుప్పల్ లో దారుణం.. మహిళపై అత్యాచారం, ఆపైగా హత్య

Crime: చౌటుప్పల్ లో దారుణం.. మహిళపై అత్యాచారం, ఆపైగా హత్య

HT Telugu Desk HT Telugu

11 May 2022, 8:12 IST

    • యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలో దారుణ ఘటన జరిగింది. ఓ మహిళపై అత్యాచారం చేసి.. హత్య చేశారు. ఈ కేసులో 24 గంటల్లోనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
గిరిజన మహిళపై హత్యాచారం
గిరిజన మహిళపై హత్యాచారం

గిరిజన మహిళపై హత్యాచారం

woman raped and murdered at toopranpet: బతుకుదెరువు కోసం వారు వచ్చారు.. హైదరాబాద్‌-విజయవాడ హైవే సమీపంలోని ఒక గోదాము వద్ద కాపలాదారులుగా ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇదే సమయంలో భర్త.. ఓ కాలేజీలో సెక్యూరిటీ గార్డ్ గా కూడా పని చేస్తున్నాడు. ఈ సమయంలో భార్య ఒక్కరే ఇంట్లో ఉంటుంది. సీన్ కట్ చేస్తే ఆమెపై ఓ దుండగుడు అత్యాచారానికి దిగాడు. అపస్మారస్థితిలో వెళ్లాక కూడా మరోసారి లైంగిక దాడి చేయటంతో ఆమె ప్రాణాలు కోల్పోంది. పైగా ఆమెపై ఉన్న సోమ్ములను కూడా తీసుకెళ్లాడు. సోమవారం జరిగిన ఈ దారుణ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలుగు చూసింది.

ట్రెండింగ్ వార్తలు

TSRTC Jeevan Reddy Mall : అద్దె ఒప్పందం రద్దు , జీవన్ రెడ్డి మాల్ స్వాధీనం - టీఎస్ఆర్టీసీ ప్రకటన

Telangana Rains : కరీంనగర్ జిల్లాలో గాలివాన బీభత్సం - పిడుగుపాటుతో ఇద్దరు మృతి

Bhadradri District : ఎంత అమానుషం! పండగకు చందా ఇవ్వలేదని 19 కుటుంబాల గ్రామ బహిష్కరణ

Heavy Rain in Hyderabad : ఒక్కసారిగా మారిన వాతావరణం - హైదరాబాద్‌లో కుండపోత వర్షం

ఏం జరిగిందంటే..

హత్యాచారానికి గురైన మహిళది నాగర్‌ కర్నూల్‌ జిల్లా. మార్చి నెలలో  ఆమె భర్తతో పాటు చౌటుప్పల్ మండల పరిధిలోని తూప్రాన్‌పేటకు వలస వచ్చారు. వారిద్దరూ హైదరాబాద్‌-విజయవాడ హైవే సమీపంలోని ఒక గోదాము వద్ద కాపలాదారులుగా ఉంటున్నారు. ఇక భర్త పగటివేళ దగ్గర్లోని ఓ కాలేజీలో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. అయితే సోమవారం ఉదయం ఆయన విధులకు వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో భార్య కనిపించలేదు. చుట్టుపక్కల వెతకగా.. సమీపంలోని గడ్డివాము దగ్గర రక్తపు మడుగులో శవమై కనిపించింది. భర్త వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

నిందితుడు అరెస్ట్..

ఈ ఘటననపై ముమ్మర దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. 24 గంటల్లోగా నిందితుడిని అరెస్ట్ చేశారు. మహిళపై అత్యాచారం చేసింది సంగారెడ్డి జిల్లాకు చెందిన యువకుడి(24)గా గుర్తించారు. అతడు తూప్రాన్‌పేటలోని ఓ సిమెంట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. పగటివేళ ఆ మహిళ ఒంటరిగా ఉంటోందని గమనించి అత్యాచారానికి తెగించినట్లు చౌటుప్పల్ పోలీసులు వెల్లడించారు. అయితే విషయం బయటకు వస్తుందన్న భయంతో నిందితుడు మహిళను చంపి ఉండవచ్చని భావిస్తున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం