Rohit Aggressive gesture Viral: కోపంతో దినేశ్ కార్తిక్ గొంతు పట్టుకున్న రోహిత్.. చంపేస్తావా ఏంటి? నెట్టింట వీడియో వైరల్
21 September 2022, 9:34 IST
- Rohit Shrama Aggressive on Dinesh karthik Viral: మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కీపర్ దినేశ్ కార్తిక్ గొంతు పట్టుకున్న రోహిత్.. కోపంతో(Rohit Aggressive Gesture) ఊగిపోయాడు.
దినేశ్ కార్తిక్పై రోహిత్ ఆగ్రహం
Rohit Sharma Aggressive on Dinesh Karthik: ఆస్ట్రేలియాతో మంగళవారం నాడు జరిగిన తొలి టీ20లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో బౌలర్లు విఫలం కావడంతో భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా సునాయసంగా ఛేదించి సిరీస్ను 1-0 తేడాతో లీడ్లోకి తీసుకెళ్లింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ మ్యాచ్లో రోహిత్ శర్మకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రోహిత్ శర్మ కోపంతో(Rohit Aggressive) దినేశ్ కార్తీక్ గొంతు పట్టుకుని పిసికేందుకు ప్రయత్నించిన ఈ వీడియోపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.
అసలేం జరిగిందంటే.. 12వ ఓవర్ రెండో బంతిని ఉమేశ్ యాదవ్ స్ట్రైకింగ్ ఎండ్లో బ్యాటింగ్ చేస్తున్న స్టీవ్ స్మిత్కు సంధించాడు ఉమేశ్ యాదవ్. అయితే ఆ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని కీపక్ కార్తిక్ చేతిలో పడింది. అయితే అంపైర్ నాటౌట్గా ప్రకటించడంతో టీమిండియా రివ్యూ తీసుకుంది. ఇందులో ఎడ్జ్ తాకినట్లు తేలడంతో స్మిత్ ఔటయ్యాడు. తిరిగి అదే ఓవర్ చివరి బంతికి గ్లెన్ మ్యాక్స్వెల్ వైపు సంధించాడు ఉమేశ్. ఆ బంతి కూడా బ్యాట్ ఎడ్జ్ తీసుకుని కీపర్ చేతుల్లోకి వెళ్లింది. ఈ సారి కూడా అంపైర్ నాటౌట్ అని చెప్పడంతో భారత్.. రివ్యూ తీసుకుంది. రివ్యూ టీమిండియాకు సానుకూలంగా రావడంతో భారత ఆటగాళ్లు సంబురాలు చేసుకున్నారు.
ఇదే సమయంలో రోహిత్ శర్మ కోపంగా ముఖం పెట్టి.. దినేశ్ కార్తిక్ గొంతును పట్టుకుని పిసికేందుకు ప్రయత్నించాడు. జోక్గా పట్టుకున్నట్లు అర్థమవుతున్నప్పటికీ.. రోహిత్ ముఖం చూస్తే మాత్రం కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది. బంతి.. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్నప్పుడు అప్పీల్ చేయనందుకుగానూ.. దినేశ్ కార్తిక్తో ఈ విధంగా ప్రవర్తించాడు హిట్ మ్యాన్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఈ వీడియోపై విశేషంగా స్పందిస్తున్నారు. ఇద్దరి స్నేహితులు మధ్య స్నేహం ఇలాగే ఉంటుందని సానుకూలంగా స్పందిస్తున్నారు. మరికొంతమంది మాత్రం.. దినేశ్ కార్తిక్ను చంపేస్తావా ఏంటి రోహిత్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఈ టీ20లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫలితంగా ఆసీస్.. మూడు టీ20 సిరీస్ను 1-0 తేడాతో ఆధిక్యాన్ని సాధించింది. మొదట్లో కామెరాన్ గ్రీన్ (30 బాల్స్లో 61), చివర్లో మాథ్యూ వేడ్(21) 45) మెరుపులు మెరిపించి ఆస్ట్రేలియాకు కళ్లు చెదిరే విజయాన్ని అందించారు. అక్షర్ పటేల్ 4 ఓవర్లలో కేవలం 17 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసినా.. మిగతా బౌలర్లు విఫలమవడంతో ఇండియాకు ఓటమి తప్పలేదు.
స్టార్ బౌలర్లు భువనేశ్వర్, చహల్, హర్షల్ పటేల్ ఘోరంగా విఫలమయ్యారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాటర్లలో కేఎల్ రాహుల్(55), హార్దిక్ పాండ్య(71) అర్ధశతకాలతో చెలరేగగా సూర్యకుమార్ యాదవ్(71) మరోసారి మెరుపు ఇన్నింగ్స్తో బ్యాట్ ఝుళిపించాడు. ఫలితంగా భారత్ 208 పరుగుల భారీ స్కోరు సాధించింది.