తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Prithvi Shaw Kissing Photo: వాలెంటైన్స్ డే నాడు పృథ్వీ షా కిస్సింగ్ ఫొటో వైరల్.. అతని రియాక్షన్ ఇదీ

Prithvi Shaw Kissing Photo: వాలెంటైన్స్ డే నాడు పృథ్వీ షా కిస్సింగ్ ఫొటో వైరల్.. అతని రియాక్షన్ ఇదీ

Hari Prasad S HT Telugu

14 February 2023, 19:39 IST

    • Prithvi Shaw Kissing Photo: వాలెంటైన్స్ డే నాడు పృథ్వీ షా కిస్సింగ్ ఫొటో వైరల్ అయింది. తన గర్ల్‌ఫ్రెండ్ నిధి తపాడియాతో ఉన్న ఫొటోను పోస్ట్ చేసిన అతడు.. తర్వాత యూటర్న్ తీసుకొని ఎవరో దానిని ఎడిట్ చేశారని అనడం విశేషం.
పృథ్వీ షా చేసిన పోస్ట్ ఇదే
పృథ్వీ షా చేసిన పోస్ట్ ఇదే (Prithvi Shaw Instagram )

పృథ్వీ షా చేసిన పోస్ట్ ఇదే

Prithvi Shaw Kissing Photo: వాలెంటైన్స్ డే రోజు ఎంతో మంది సెలబ్రిటీలు తమ వారితో ఉన్న ఫొటోలు షేర్ చేస్తూ విషెస్ చెప్పాడు. ఇండియన్ క్రికెటర్ పృథ్వీ షా కూడా అలాంటి పోస్టే తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశాడు. తన గర్ల్‌ఫ్రెండ్ నిధి తపాడియాకు ముద్దివ్వబోతున్న ఫొటో అది. ఆ పోస్ట్ వెంటనే వైరల్ గా మారిపోయింది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

అయితే తర్వాత ఏమైందో గానీ ఈ పోస్ట్ పై అతడు యూటర్న్ తీసుకున్నాడు. ఆ పోస్ట్ డిలీట్ చేశాడు. అంతేకాదు తన ఫొటోలను ఎవరో ఎడిట్ చేస్తున్నారంటూ మరో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో చెప్పాడు. "ఎవరో నా ఫొటోలను ఎడిట్ చేస్తున్నారు. నేను నా స్టోరీలోగానీ, పేజ్ లోగానీ చేయని పోస్ట్ లను చేస్తున్నారు. వాటిని ఎవరూ పట్టించుకోవద్దు" అని పృథ్వీ షా అన్నాడు.

అతడు ఎందుకిలా యూటర్న్ తీసుకున్నాడో చాలా మందికి అంతుబట్టలేదు. అంతకుముందు పృథ్వీతో ఉన్న రిలేషన్‌షిప్ పై నిధి ఓపెన్ అయింది. ప్రస్తుతం స్వర్గంలో ఉన్నట్లుంది అని మోడల్, నటి అయిన నిధి పోస్ట్ చేస్తూ అతన్ని ట్యాగ్ చేసింది. ఈ పోస్ట్ వెంటనే వైరల్ గా మారిపోయింది. ఇన్‌స్టాగ్రామ్ లో పృథ్వీకి 15 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

మరోవైపు చాలా రోజులుగా ఇండియన్ టీమ్ లోకి తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్న పృథ్వీకి ఈ మధ్యే న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. అయితే అతనికి మూడు మ్యాచ్ లలోనూ తుది జట్టులో ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఏడాది కాలంగా పృథ్వీ డొమెస్టిక్ క్రికెట్ లో టాప్ ఫామ్ లో ఉన్నాడు. రంజీ ట్రోఫీలో అస్సాంపై ఏకంగా 379 రన్స్ చేశాడు.

పృథ్వీ షా ఇచ్చిన వివరణ ఇదీ

టాపిక్

తదుపరి వ్యాసం