తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News | మద్యం తాగించి బాలికపై.. పబ్లిక్​ టాయిలెట్​లో మహిళపై..!

crime news | మద్యం తాగించి బాలికపై.. పబ్లిక్​ టాయిలెట్​లో మహిళపై..!

HT Telugu Desk HT Telugu

20 March 2022, 20:25 IST

    • దేశంలో మహిళలు, బాలికలపై అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా.. గుజరాత్​లో ఓ బాలికకు మద్యం తాగించి.. కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మరో ఘటనలో.. ఓ మహిళ.. పబ్లిక్​ టాయిలెట్​లో అత్యాచారానికి గురైంది.
మహిళలపై పెరిపోతున్న అత్యాచారం
మహిళలపై పెరిపోతున్న అత్యాచారం (Hindustan times telugu)

మహిళలపై పెరిపోతున్న అత్యాచారం

Girl raped | గుజరాత్​ కచ్​ జిల్లాలోని భుజ్​ పట్టణ శివారుల్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 17ఏళ్ల బాలిక చేత మద్యం తాగించి.. కొందరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

ఈ నెల 16న జరిగిన ఘటనకు సంబంధించి మొత్తం నలుగురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. బాలిక తన ఫ్రెండ్​తో కలిసి పోలానికి వెళ్లింది. అక్కడే నిందితుడు.. ఆమె చేత మద్యం తాగించాడు. తర్వాత ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.

బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. వారిలో ఓ నిందితుడిని బాలిక గుర్తించింది. మరో వ్యక్తి బాలికను అత్యాచారం చేసినట్టు ఒప్పుకున్నాడు. బాలిక అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు మరో ఇద్దరు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారా? లేదా? అన్నది తెలుసుకోవడం కోసం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ ఘటనపై పోలీసులు సెక్షన్​ 366, సెక్షన్​ 328, సెక్షన్​ 376, సెక్షన్​ 114 కింద కేసు నమోదు చేసుకున్నారు. నిందితులు ప్రస్తుతం పోలీసుల కస్టడీలోనే ఉన్నారు.

పబ్లిక్​ టాయిలెట్​లో..

Woman raped in toilet | దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఉత్తర్​ప్రదేశ్​లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. తాజాగా.. ఓ 20ఏళ్ల మహిళ.. పబ్లిక్​ టాయిలెట్​లో అత్యాచారానికి గురైన ఘటన కలకలం సృష్టించింది.

పోలీసుల సమాచారం ప్రకారం.. ఈ ఘటన ప్రతాప్​గఢ్​ రైల్వే స్టేషన్​కు సమీపంలో శనివారం చోటుచేసుకుంది. బాధితురాలు.. తన భర్తతో కలిసి రైల్వే స్టేషన్​కు వెళ్లింది. కాగా.. టీ కొనేందుకు భర్త బయటకు వెళ్లాడు. ఒంటరిగా ఉన్న మహిళలను నిందితుడు అన్నా చుశాడు. మహిళ వద్దకు వెళ్లి.. తన వద్ద టాయిలెట్​ కీస్​ ఉన్నాయని, అవసరమైతే వాడుకోవచ్చని చెప్పాడు. కీస్​ తీసుకున్న మహిళ.. స్టేషన్​ బయట ఉన్న పార్కింగ్​ స్టాండ్​ దగ్గర్లోని పబ్లిక్​ టాయిలెట్​కు వెళ్లింది. అప్పుడే లోపలికి ప్రవేశించిన నిందితుడు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశారు.

బాలికపై తండ్రి, సోదరుడు అత్యాచారం..!

Girl raped | మహారాష్ట్ర పుణెలో.. మానవజాతి తలదించుకునే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ బాలికపై ఆమె తండ్రి, సోదరుడు, తాత, మామ.. గత ఐదేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు.

ఇంత దారుణమా..!

బాధితురాలి కుటుంబం బిహార్​కు చెందినది. పుణెలో ప్రస్తుతం వారు నివాసముంటున్నారు. 2017లో కుటుంబం బిహార్​లో ఉన్నప్పటి నుంచే బాలికపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. 2020 నవంబర్​లో బాలిక సోదరుడు సైతం అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత.. బాలిక తాత, మామ.. పలుమార్లు ఆమెపై అభ్యంతరకర రీతిలో ప్రవర్తించారు.

Pune crime news | ఐదేళ్లుగా బాలిక నరకం అనుభవిస్తోంది. తాజాగా.. ఆమె స్కూలులో జరిగిన ఓ కార్యక్రమంలో బాలిక ఈ విషయాలను బయటపెట్టింది. స్కూలు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 45ఏళ్ల తండ్రి, 11ఏళ్ల సోదరుడిపై సెక్షన్​ 376 కింద కేసు నమోదు చేశారు. 60ఏళ్ల తాత, 25ఏళ్ల దూరపు చుట్టమైన మామపై సెక్షన్​ 354 కింద లైంగిక వేధింపుల కేసు వేశారు. కాగా.. ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్​ చేయలేదు.

అయితే.. ఇది సామూహిక అత్యాచారం కాదని పోలీసులు చెబుతున్నారు. వేరువేరుగా ఘటనలు జరిగాయని, బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నట్టు.. ఒకరి గురించి మరొకరికి తెలిసి ఉండదని అభిప్రాయపడుతున్నారు.

తదుపరి వ్యాసం