తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  సెన్సెక్స్ భారీ పతనం.. 867 పాయింట్లు కోల్పోయిన సూచీ

సెన్సెక్స్ భారీ పతనం.. 867 పాయింట్లు కోల్పోయిన సూచీ

HT Telugu Desk HT Telugu

06 May 2022, 16:09 IST

  • ముంబై, మే 6: గ్లోబల్ మార్కెట్లలో అమ్మకాల ట్రెండ్ కారణంగా సెన్సెక్స్ 866.65 పాయింట్లు పతనమై 55,000 మార్క్ దిగువకు చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్ల పతనం భారతీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపింది
అంతర్జాతీయ మార్కెట్ల పతనం భారతీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపింది (Bloomberg)

అంతర్జాతీయ మార్కెట్ల పతనం భారతీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపింది

ఎడతెగని విదేశీ నిధుల తరలింపు, ముడి చమురు ధరలు దిగిరాకపోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి.

బిఎస్‌ఇ సెన్సెక్స్ 866.65 పాయింట్లు (1.56 శాతం) క్షీణించి 54,835.58 వద్ద క్లోజ్ అయ్యింది. ఇంట్రా డేలో 1,115.48 పాయింట్లు కోల్పోయి 54,586.75 వద్దకు చేరుకుంది.

అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 271.40 పాయింట్లు (1.63 శాతం) పతనమై 16,411.25 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్ సూచీలోని బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, నెస్లే, విప్రో, హెచ్‌డిఎఫ్‌సి, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టపోయాయి. దీనికి భిన్నంగా టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, ఐటీసీ, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ షేర్లు లాభపడ్డాయి.

ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో హాంకాంగ్, షాంఘై, కొరియా మార్కెట్లు గణనీయంగా పతనమవగా, టోక్యో మార్కెట్లు లాభాలతో ముగిశాయి. యూరప్‌లోని ఎక్స్ఛేంజీలు మధ్యాహ్నం సెషన్‌లో ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. అమెరికాలో గురువారం రాత్రి ట్రేడింగ్‌లో స్టాక్ ఎక్స్ఛేంజీలు భారీగా పడిపోయాయి. 

‘పెరుగుతున్న వడ్డీ రేట్లపై మరింత ఆందోళన కారణంగా గురువారం అది పతనమైంది..’ అని హేమ్ సెక్యూరిటీస్ హెడ్  మోహిత్ నిగమ్ అన్నారు.

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గురువారం తన కీలక వడ్డీ రేటును 13 ఏళ్లలో గరిష్ట స్థాయికి పెంచింది. అంతర్జాతీయ చమురు బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 2.20 శాతం పెరిగి 113.3 డాలర్లకు చేరుకుంది. స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గురువారం నికరంగా రూ. 2,074.74 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.

టాపిక్

తదుపరి వ్యాసం