Viral : ఒక్క ఆటోలో 27మంది ప్రయాణికులు.. పోలీసులే షాక్!
11 July 2022, 14:18 IST
- Viral : ఆటో డ్రైవర్లు డబ్బుకు ఆశపడి ఎక్కువమందిని ఎక్కించుకోవడం సాధారణ విషయమే. కానీ ఓ డ్రైవర్.. 27మంది ప్రయాణికులతో బండి నడిపితే? ఈ షాకింగ్ ఘటన ఉత్తర్ప్రదేశ్లో చోటుచేసుకుంది.
ఒక్క ఆటోలో 27మంది ప్రయాణికులు.. పోలీసులే షాక్!
Viral : సాధారణంగా ఆటోలో ముగ్గురు పడతారు. 7 సీటర్ అయితే ఏడుగురు ప్రయాణించవచ్చు. కానీ ఆటో డ్రైవర్లు.. ఒక్కోసారి సామర్థ్యానికి మించి జనాలను ఎక్కించుకుంటారు. ఇదంతా సాధారణ విషయమే. కానీ ఒక ఆటోలో.. ఏకంగా 27మంది ప్రయాణిస్తే? నోరెళ్లబెట్టే ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లో జరిగింది. ఇది చూసి పోలీసులే షాక్ అయ్యారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఫాతేహ్పూర్లో ఆదివారం వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. బిండ్కి కోత్వాలా ప్రాంతంలో ఆ ఆటో వేగంగా దూసుకెళుతుండటాన్ని గమనించిన పోలీసులు.. దానిని వెంబడించారు. చివరికి పట్టుకున్నారు. ఈ క్రమంలోనే ప్యాసింజర్లను కిందకి దింపడం మొదలుపెట్టారు. ఒక్కొక్కరిని లెక్కేసుకుంటూ వెళ్లారు. చిన్నా, పెద్దా.. అందరిని కలుపుకుని.. ఆ ఆటోలో నుంచి ఏకంగా 27మంది బయటకొచ్చారు. మొత్తం డ్రైవర్ను కలుపుకుంటే.. ఆ ఆటోలో 28మంది ఉన్నట్టు.
ప్రయాణికుల సంఖ్యను లెక్కపెడుతున్నప్పుడు.. పోలీసులే షాక్ అయ్యారు. వెంటనే ఆటోను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు.
ఈ విషయంపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయాణికుల భద్రతను విస్మరించి ఆటోను నడపటం సరికాదు అని అంటున్నారు. డబ్బులకు ఆశపడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కామెంట్లు పెడుతున్నారు.