Road accident in UP: యూపీలో ఘోర ప్రమాదం; 25 మంది దుర్మరణం
01 October 2022, 22:49 IST
- Road accident in UP: ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ట్రాక్టర్ తిరగబడిన ఈ ప్రమాదంలో 25 మంది దుర్మరణం పాలయ్యారు.
ప్రతీకాత్మక చిత్రం
Road accident in UP: దైవ దర్శనానికి వెళ్లి తిరిగివస్తున్న సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మృతుల్లో 11 మంది మహిళలు, 11 మంది చిన్న పిల్లలు ఉన్నారు.
Road accident in UP: ఉన్నావ్ నుంచి వస్తుండగా..
యూపీలోని కాన్పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉన్నావ్ లో దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కాన్పూర్ సమీపంలో అదుపు తప్పిన ట్రాక్టర్ రోడ్డుపై బోల్తా పడింది. దాంతో ట్రాక్టర్ ట్రాలీ లో ఉన్న వారంతో దాని కింద పడిపోయారు. వారిలో పాతిక మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో 11 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.
Road accident in UP: పరిహారం
ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్య నాథ్ తీవ్ర సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం అందిస్తున్నట్లు ప్రధాని కార్యాలయం ఒక ట్వీట్ లో తెలిపింది. ప్రమాద స్థలికి వెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా కలెక్టర్ ను, ఇతర అధికారులను ఆదేశించినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ తెలిపారు.