తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Maharashtra, Karnataka Border Issue: సరిహద్దు సమస్యకు సుప్రీం తీర్పే పరిష్కారం

Maharashtra, Karnataka border issue: సరిహద్దు సమస్యకు సుప్రీం తీర్పే పరిష్కారం

HT Telugu Desk HT Telugu

14 December 2022, 21:55 IST

  • Maharashtra, Karnataka border issue: కర్నాటక, మహారాష్ట్రల మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యపై బుధవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్యవర్తిత్వంలో ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది.

సమావేశం వివరాలను మీడియాకు వెల్లడిస్తున్న అమిత్ షా; చిత్రంలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండ్, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, కర్నాటక సీఎం బొమ్మై
సమావేశం వివరాలను మీడియాకు వెల్లడిస్తున్న అమిత్ షా; చిత్రంలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండ్, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, కర్నాటక సీఎం బొమ్మై (PTI)

సమావేశం వివరాలను మీడియాకు వెల్లడిస్తున్న అమిత్ షా; చిత్రంలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండ్, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, కర్నాటక సీఎం బొమ్మై

Maharashtra, Karnataka border issue: సరిహద్దు సమస్య పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున, ఆరుగురు సభ్యులతో మంత్రుల కమిటీ ని ఏర్పాటు చేయడానికి మహారాష్ట్ర, కర్నాటక అంగీకరించాయి.

ట్రెండింగ్ వార్తలు

Fact Check : 'ల్యాబ్​లో పిల్లలను నచ్చినట్టు తయారు చేసుకోవచ్చు' అంటున్న ఈ వైరల్​ వీడియోలో నిజమెంత?

Sushil Modi death : బీజేపీ సీనియర్​ నేత సుశీల్ కుమార్​​ మోదీ కన్నుమూత..

Viral : ఆటగాడివే! ఒకేసారి ఇద్దరు గర్ల్​ఫ్రెండ్స్​.. దొరికిపోయి- చివరికి..

Southest Monsoon : గుడ్​ న్యూస్​.. ఇంకొన్ని రోజుల్లో దేశాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు!

Maharashtra, Karnataka border issue: 1950ల నుంచి..

భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటైన సమయంలో బెలగావి ప్రాంతంలోని మరాఠీ మాట్లాడే సుమారు 865 గ్రామాలను అన్యాయంగా కర్నాటకలో కలిపారని చాలా ఏళ్లుగా మహారాష్ట్ర వాదిస్తోంది. ఆ వాదనను కర్నాటక అంగీకరించడం లేదు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో నిర్ధారించిన సరిహద్దు రేఖనే అంతిమమని కర్నాటక స్పష్టం చేస్తోంది. బెలగావి తమదేనని నిర్ధారించడానికి అక్కడ ప్రత్యేకంగా విధాన సౌధను కూడా నిర్మించింది. ఈ సరిహద్దు వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది.

Maharashtra, Karnataka border issue: అమిత్ షా మధ్యవర్తిత్వం

ఇటీవల ఈ వివాదం ఉద్రిక్తంగా మారింది. మహారాష్ట్ర నుంచి వచ్చిన ట్రక్ లను కర్నాటకలో ధ్వంసం చేశారు. కర్నాటకలో తిరగనివ్వబోమని వాటిని అడ్డుకున్నారు. మరోవైపు, కర్నాటక బస్సులను పుణెలో శివసేన(ఉద్ధవ్ వర్గం) ధ్వంసం చేశారు. ఈ వివాదం రాజకీయంగా కూడా ఉద్రిక్తతలకు దారి తీసింది. రెండు రాష్ట్రాలు కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు కావడంతో, ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా నడుం బిగించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో మహారాష్ట్రర సీఎం ఏక్ నాథ్ షిండే, కర్నాటక సీఎం బస్వరాజ్ బొమ్మై బుధవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, కర్నాటక హోం మంత్రి కూడా పాల్గొన్నారు.

Maharashtra, Karnataka border issue: ముఖ్యమంత్రుల భేటీ

సీఎంల సమావేశం అనంతరం ఆ వివరాలను అమిత్ షా మీడియాకు వెల్లడించారు. ఈ వివాదం సుప్రీంకోర్టు విచారణలో ఉన్నందున సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు సంయమనం పాటించాలని, సుప్రీం తీర్పును అంగీకరించాలని షా ఇరు రాష్ట్రాల సీఎంలకు స్పష్టం చేశారు. వీధి పోరాటాల ద్వారా ఈ సమస్య పరిష్కారం కాదని, అనవసరంగా దీన్ని రాజకీయాంశం చేయవద్దని సూచించారు. సమస్య పరిష్కారానికి సూచనలు చేసేందుకు రెండు రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున, ఆరుగురు సభ్యులతో మంత్రుల కమిటీ ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ వివాదంపై సోషల్ మీడియాలో అనుచిత కామెంట్లు చేసినా, ఉద్రిక్తతలు పెరిగేలా పోస్ట్ లు పెట్టినా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

తదుపరి వ్యాసం