తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  5 Army Soldiers Killed: ఐదుగురు భారతీయ సైనికుల దుర్మరణం

5 Army soldiers killed: ఐదుగురు భారతీయ సైనికుల దుర్మరణం

HT Telugu Desk HT Telugu

20 April 2023, 19:30 IST

  • 5 Army soldiers killed: జమ్మూకశ్మీర్లో ఐదుగురు భారతీయ సైనికులు దుర్మరణం పాలయ్యారు. వారు ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదవశాత్తూ నిప్పంటుకుని, తగలబడడంతో, వారు ప్రాణాలు కోల్పోయారు. 

మంటల్లో ఆర్మీ వాహనం
మంటల్లో ఆర్మీ వాహనం (PTI)

మంటల్లో ఆర్మీ వాహనం

5 Army soldiers killed: జమ్మూకశ్మీర్లో ఐదుగురు భారతీయ సైనికులు దుర్మరణం పాలయ్యారు. వారు ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదవశాత్తూ నిప్పంటుకుని, తగలబడడంతో, వారు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ కశ్మీర్లోని పూంఛ్ జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ట్రెండింగ్ వార్తలు

CBSE Class 12 Result 2024: సీబీఎస్ఈ 12వ తరగతి మార్కుల వెరిఫికేషన్ కు రిజిస్ట్రేషన్ ప్రారంభం

Bihar crime news : కస్టడీలో దంపతులు మృతి.. ప్రజల ఆగ్రహానికి తగలబడిన పోలీస్​ స్టేషన్​!

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

5 Army soldiers killed: ప్రమాదమేనా?

జమ్మూకశ్మీర్లో భారతీయ సైనికులు ప్రయాణిస్తున్న వాహనం తగలబడడంతో అందులోని ప్రయాణిస్తున్న సైనికుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ వాహనం పూంచ్ జిల్లాలోని భింబర్ గాలి నుంచి సాంగియోట్ కు వెళ్తోంది. గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ప్రమాదానికి కారణమైన అంశాల గురించి దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఈ ఘటనకు కారణం ప్రమాదమేనా? మరే కారణమేదైనా ఉందా? అన్న కోణంలోనూ దర్యాప్తు జరుగుతోందన్నారు. వాహనంపై పిడుగు పడడం వల్ల అది తగలబడి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఆ వాహనానికి ఎలా నిప్పంటుకుంది? ప్రమాదంలో మరణించిన జవాన్ల వివరాలు.. మొదలైనవి ఇంకా వెల్లడి కాలేదు.

తదుపరి వ్యాసం