Tiger 3 OTT Update: టైగర్ 3 మూవీపై అప్డేట్ ఇచ్చిన ఓటీటీ ప్లాట్ఫామ్.. కానీ!
06 January 2024, 15:02 IST
- Tiger 3 OTT Update: టైగర్ 3 సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఆ తరుణంలో ఈ సినిమా గురించి అప్డేట్ ఇచ్చింది అమెజాన్ ప్రైమ్ వీడియో. ఆ వివరాలివే..
Tiger 3 OTT Update: టైగర్ 3 మూవీపై అప్డేట్ ఇచ్చిన ఓటీటీ ప్లాట్ఫామ్
Tiger 3 OTT Update: బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘టైగర్-3’ బ్లాక్బాస్టర్ అయింది. గతేడాది దీపావళి సీజన్లో వచ్చిన ఈ చిత్రం సుమారు రూ.450కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకుంది. యశ్రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ (YRF Spy Universe) లైనప్లో ఐదో చిత్రంగా ‘టైగర్ 3’ వచ్చింది. మనీశ్ మిశ్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సల్మాన్ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. అయితే, ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది నిరీక్షిస్తున్నారు. స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ తరుణంలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ అప్డేట్ ఇచ్చింది.
టైగర్ 3 సినిమాను త్వరలో స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్టు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ఫామ్ నేడు వెల్లడించింది. కానీ, త్వరలో అని చెప్పింది కానీ కచ్చితమైన స్ట్రీమింగ్ డేట్ను మాత్రం వెల్లడించలేదు. “టైగర్ వచ్చేస్తోంది. ప్రైమ్లో టైగర్ 3 త్వరలో” అని ప్రైమ్ వీడియో ట్వీట్ చేసింది. డేట్ను వెల్లడించలేదు. అయితే, స్ట్రీమింగ్ డేట్ను అతిత్వరలోనే ప్రైమ్ వీడియో ఖరారు చేస్తుండని తెలుస్తోంది. మరో మూడు రోజుల్లోగానే టైగర్ 3 స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. జనవరి 7న ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుందని బజ్ నడుస్తోంది.
టైగర్ 3 మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు వస్తుంది. ఈ విషయాన్ని ప్రైమ్ వెల్లడించింది. సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్, ఇమ్రాన్ హష్మి గన్స్ పట్టుకున్న ఓ పోస్టర్ను ట్వీట్ చేసింది. కొత్త సంవత్సరం సందర్భంగా 2023 డిసెంబర్ 31నే టైగర్ 3 ఓటీటీలోకి వస్తుందని అప్పట్లో స్ట్రాంగ్ బజ్ నడిచింది. అయితే, మరింత ఆలస్యం చేసింది ప్రైమ్ వీడియో. ఇప్పుడు ఎట్టకేలకు అప్డేట్ ఇచ్చింది.
టైగర్ 3 చిత్రంలో రా ఏజెంట్గా సల్మాన్ ఖాన్ నటించారు. అతడి భార్య, ఐఎస్ఐ ఏజెంట్ జోయా పాత్రలో హీరోయిన్ కత్రినా కైఫ్ కనిపించారు. ఇమ్రాన్ హష్మి, రేవతి, సిమ్రన్, రిధి డోగ్రా, విశాల్ జేత్వా, కుముద్ మిశ్రా కీలకపాత్రలు పోషించారు. మనీశ్ శర్మ తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రీతమ్, తనూజ్ టికు సంగీతం అందించారు.
వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లైనప్లో ఎక్తా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్ తర్వాత ఐదో చిత్రంగా టైగర్ 3 వచ్చింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీలో సల్మాన్, కత్రినా యాక్షన్ సీక్వెన్లులు అభిమానులను విపరీతంగా మెప్పించాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.460కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
టైగర్ (సల్మాన్ ఖాన్), అతడి భార్య జోయా (కత్రినా కైఫ్) సంతోషంగా జీవితం గడుపుతున్న సందర్భంలో ఓ ముప్పును ఎదుర్కొంటారు. వారి కొడుకును టెర్రరిస్ట్ అతీష్ రహమాన్ (ఇమ్రాన్ హష్మి) కిడ్నాప్ చేస్తాడు. తాను చెప్పే పని చేయకపోతే అతడిని చంపేస్తానని టైగర్, జోయాను బెదిరిస్తాడు. ఆ తర్వాత టైగర్, జోయా ఏం చేశారు? రహమాన్ చెప్పిన పని చేశారా? తమ కుమారుడిని రక్షించుకున్నారా? బయటపడిన నిజాలేంటి" అనేవే టైగర్ 3 మూవీ ప్రధానమైన పాయింట్లుగా ఉన్నాయి.