తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thaman | త్వరలో సర్కారు వారి పాట నుంచి మెలోడీ, మాస్ సాంగ్

Thaman | త్వరలో సర్కారు వారి పాట నుంచి మెలోడీ, మాస్ సాంగ్

30 April 2022, 20:25 IST

    • సర్కారు వారి పాట సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు తమన్. ఈ సినిమా నుంచి ఓ మాస్‌ సాంగ్‌తో పాటు మరో మెలోడీ కూడా విడుదల కాబోతుందని స్పష్టం చేశారు. రాబోయే 15 రోజులు ఈ సినిమా నుంచి ఏదోక అప్డేట్ వస్తూనే ఉంటుందని తెలిపారు.
తమన్
తమన్ (Twitter)

తమన్

సర్కారు వారి పాట సినిమా నుంచి ఇప్పటికే టైటిల్ సాంగ్ సహా కొన్ని పాటలు విడుదలయ్యాయి. దీంతో సూపర్ స్టార్ మహేశ్ అభిమానులు సినిమాపై అంచనాలు భారీగా పెంచేసుకున్నారు. ముఖ్యంగా కళావతి సాంగ్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మే 12న విడుదల కానున్న ఈ చిత్రం నుంచి మరో మెలోడీ సహా మాస్ సాంగ్‌ను త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు తమన్ స్పష్టం చేశారు. ప్రతిసారి బెస్ట్ ఆల్బమ్ ఇవ్వడానికే తాను ప్రయత్నిస్తానని ఆయన అన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Prabhas Instagram Story: ప్రభాస్ పెళ్లి కాదు.. అతని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వెనుక అసలు విషయం ఇదీ

Preminchoddu: షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడు.. మూడేళ్లు కష్టపడి సినిమా తీశాడు.. హీరో కామెంట్స్

Suriya Kanguva: సూర్య కంగువ.. పది వేల మందితో సూర్య, బాబీ డియోల్ వార్ సీన్ షూటింగ్

Kajal Agarwal Kannappa: మంచు విష్ణు కన్నప్పలో కాజల్ అగర్వాల్.. అప్పుడు చెల్లెలిగా ఇప్పుడు?

"గతలో ఎక్కువగా కమర్షియల్ సినిమాలకే ఎక్కువగా పనిచేసే అవకాశం వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. విభిన్న జోనర్‌ల సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నా. కంటెంట్ ప్రధానంగా సాగే కథలకు సంగీతం సమకూరుస్తున్నాం. కథ, కథనంలో భాగంగా పాటలు వస్తున్నాయి. ఆ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఆసక్తికరంగా థియేటర్లలో కళావతి లాంటి మెలోడీ సాంగ్స్‌ను ప్రేక్షకులు ఎక్కువగా ఆస్వాదిస్తున్నారు." అని తమన్ తెలిపారు.

సర్కారు వారి పాట చిత్రం గురించి మాట్లాడిన తమన్.. అభిమానుల కోసం అన్ని హంగులతో కూడిన అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైటనర్‌గా ఇది ఉండబోతుందని స్పష్టం చేశారు. కళావతి సాంగ్‌ను దాదాపు రెండేళ్ల క్రితం కంపోజ్ చేశానని, కరోనా సమయంలో ట్యూన్ చేసిన ఇలాంటి లవ్ సాంగ్‌ను ఇటీవల కాలంలో మహేశ్ బాబుకు పడలేదని అన్నారు. అందుకే ఈ సాంగ్‌నే ముందుగా విడుదల చేయాలని దర్శకునికి సూచించానని తెలిపారు. పెన్నీ సాంగ్‌లో మహేశ్ బాబు తనయ సితారను నటింపజేయమని తానే చెప్పానని, సితార ఇన్ స్టా రీల్స్ చూపించి నమ్రతను, మహేశ్‌ను ఒప్పించానని చెప్పుకొచ్చారు.

రాబోయే 15 రోజులు సర్కారు వారి పాట నుంచి ప్రమోషన్లు, అప్డేట్లు ఏవోకటి వస్తూనే ఉంటాయని తెలిపారు. త్వరలోనే మిగిలిన రెండు పాటలను విడుదల చేస్తామని ఆయన అన్నారు. ఇందులో ఓ మాస్ పాటతో పాటు మరో మెలోడీ కూడా రాబోతుందని తెలిపారు.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేనీ, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం