తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Saakini Daakini Teaser: శాకిని డాకినిగా రెజీనా, నివేధా థామస్.. టీజర్ విడుదల

Saakini Daakini Teaser: శాకిని డాకినిగా రెజీనా, నివేధా థామస్.. టీజర్ విడుదల

23 August 2022, 14:15 IST

    • రెజీనా, నివేధా థామస్ కలిసి నటించిన శాకిని డాకిని టీజర్ విడుదలైంది. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో విడుదలైన ఈ చిత్రం సెప్టెంబరు 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
శాకిని డాకిని టీజర్
శాకిని డాకిని టీజర్ (Twitter)

శాకిని డాకిని టీజర్

రెజీనా కెసిండ్రా, నివేధా థామస్ కలిసి నటించిన చిత్రం శాకిని డాకిని. దక్షిణా కొరియా చిత్రం మిడ్ నైట్ రన్నర్‌కు రీమేక్‌గా తెరకెక్కుతోందీ చిత్రం. ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. సస్పెన్స్ థ్రిల్లింగ్‌తో పాటు యాక్షన్ కూడా ఈ సినిమాలో జోడించినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. పోలీసు అకాడామీకి ట్రైనింగ్‌కు వెళ్లిన శాలిని, దామిని ఇద్దరూ అమ్మాయిల మధ్య గొడవేంటి. వారిద్దరూ ఎందుకు కలిశారు? వారు చేసిన సాహసాలేంటి? లాంటివి తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

ఈ చిత్ర టీజర్‌ను గమనిస్తే రెజీనా పరిశుభ్రతకు ప్రాణమిచ్చే అమ్మాయి పాత్రలో కనిపిస్తే.. నివేధ భోజనమంటే ఇష్టపడే అమ్మాయి రోల్‌ను పోషిస్తోంది. ఈ పరిస్థితుల్లో వారు నేరస్థులను పట్టుకోవడంలో ఎలాంటి పొరపాట్లు చేస్తారు? తమ సమస్యలను ఎలా పరిష్కరించుకుంటారు? తమ నైపుణ్యాలను ఎలా నిరుపించుకున్నారు? అనేది ముఖ్య కథాంశం. ఈ టీజర్ ప్రధానంగా ఇద్దరి పాత్రలపై దృష్టి సారించింది. ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో థ్రిల్లింగ్ రైడ్ అనుభూతిని కలిగిస్తుంది.

రెజీనా, నివేధ ఇద్దరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇద్దరూ ఛాలెంజింగ్ పాత్రలను పోషించారు. దీనికి వారు కొన్ని విన్యాసాలను కూడా చేయాల్సి వచ్చింది. టీజర్ టెక్నికల్‌గా కూడా బాగుంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

సురేశ్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. డీ సురేశ్ బాబు, సునీత తాటి, హ్యూన్యూ థామస్ కిమ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు మైకీ మెక్ క్లియర్, నరేశ్ కుమారన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం