తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rashmika Mandanna: బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్‌షోకు గెస్టులుగా ర‌ణ్‌బీర్‌, ర‌ష్మిక మంద‌న్న‌?

Rashmika Mandanna: బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్‌షోకు గెస్టులుగా ర‌ణ్‌బీర్‌, ర‌ష్మిక మంద‌న్న‌?

09 November 2023, 5:54 IST

  • Rashmika Mandanna: బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ షోకు యానిమ‌ల్ హీరోహీరోయిన్లు ర‌ణ్‌బీర్‌క‌పూర్‌, ర‌ష్మిక మంద‌న్న గెస్ట్ లుగా రాబోతున్న‌ట్లు తెలిసింది. న‌వంబ‌ర్ లాస్ట్ వీక్‌లో ఈ స్పెష‌ల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఉండ‌బోతున్న‌ట్లు తెలిసింది.

ర‌ష్మిక మంద‌న్న,ర‌ణ్‌బీర్‌క‌పూర్‌,
ర‌ష్మిక మంద‌న్న,ర‌ణ్‌బీర్‌క‌పూర్‌,

ర‌ష్మిక మంద‌న్న,ర‌ణ్‌బీర్‌క‌పూర్‌,

Rashmika Mandanna: బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ షో కొత్త సీజ‌న్ ఇటీవ‌లే మొద‌లైంది. లిమిటెడ్ ఎడిష‌న్ పేరుతో స్పెష‌ల్‌గా మొద‌లైన ఈ సీజ‌న్‌కు గెస్ట్‌గా బాలీవుడ్ హీరో ర‌ణ్‌బీర్‌క‌పూర్ రాబోతున్న‌ట్లు స‌మాచారం. అత‌డితో పాటు నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక‌ మంద‌న్న‌, డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా కూడా హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిసింది.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

యానిమ‌ల్ మూవీ తెలుగు ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా వారు అన్‌స్టాప‌బుల్‌ షోకు గెస్టులుగా రాబోతున్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే ర‌ణ్‌బీర్‌, ర‌ష్మిక, సందీప్ వంగా స్పెష‌ల్ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ మొద‌లుకానున్న‌ట్లు చెబుతోన్నారు. న‌వంబ‌ర్ లాస్ట్ వీక్‌లో ఈ ఎపిసోడ్ రిలీజ్ కానున్న‌ట్లు తెలిసింది.

అన్‌స్టాపబుల్ షోకు గెస్ట్‌గా హాజ‌రుకానున్న‌ ఫ‌స్ట్ బాలీవుడ్ హీరో ర‌ణ్‌బీర్‌ క‌పూర్ కావ‌డం గ‌మ‌నార్హం. కాగా యానిమ‌ల్ మూవీ డిసెంబ‌ర్ 1న రిలీజ్ కాబోతోంది. తండ్రీకొడుకుల అనుబంధం నేప‌థ్యంలో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి అర్జున్‌రెడ్డి ఫేమ్ సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

ఈ సినిమాలో ర‌ణ్‌బీర్‌ తండ్రిగా అనిల్ క‌పూర్ న‌టిస్తోండ‌గా...బాలీవుడ్ సీనియ‌ర్ హీరో బాబీ డియోల్ విల‌న్‌గా న‌టిస్తోన్నాడు. దాదాపు 100 కోట్ల బ‌డ్జెట్‌తో టీ సిరీస్ సంస్థ‌తో క‌లిసి సందీప్ వంగా యానిమ‌ల్ మూవీని నిర్మించాడు. తొలుత ఈ సినిమాను ఆగ‌స్ట్‌లో రిలీజ్ చేయాల‌ని భావించారు. కానీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఆల‌స్యం కావ‌డంతో డిసెంబ‌ర్‌కు వాయిదాప‌డింది.

ఈ సినిమాలో ర‌ణ్‌బీర్‌క‌పూర్‌కు జోడీగా ప‌రిణీతి చోప్రాను హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారు. కానీ డేట్ ఇష్యూతో ప‌రిణీతి త‌ప్పుకోవ‌డం ఆ స్థానాన్ని ర‌ష్మిక మంద‌న్న‌తో భ‌ర్తీ చేశారు. పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో హిందీతో పాటు ద‌క్షిణాది భాష‌ల్లో ఈ మూవీ రిలీజ్ అవుతోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం