తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan Game Changer: రామ్‌చ‌ర‌ణ్‌కు గాయం - గేమ్‌ఛేంజ‌ర్ షూటింగ్‌కు బ్రేక్

Ram Charan Game Changer: రామ్‌చ‌ర‌ణ్‌కు గాయం - గేమ్‌ఛేంజ‌ర్ షూటింగ్‌కు బ్రేక్

25 September 2023, 6:42 IST

  • Ram Charan Game Changer: రామ్‌చ‌ర‌ణ్‌కు గాయం కావ‌డంతో గేమ్ ఛేంజ‌ర్‌ షూటింగ్ వాయిదాప‌డింది. రెండు రోజుల క్రితం జ‌రిగిన ప్ర‌మాదంలో రామ్‌చ‌ర‌ణ్ ముఖానికి దెబ్బ త‌గిలిన‌ట్లు స‌మాచారం. రామ్‌చ‌ర‌ణ్‌కు ప‌ది రోజులు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని డాక్ట‌ర్లు సూచించిన‌ట్లు తెలిసింది.

రామ్‌చ‌ర‌ణ్‌
రామ్‌చ‌ర‌ణ్‌

రామ్‌చ‌ర‌ణ్‌

Ram Charan Game Changer: రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తోన్న గేమ్‌ఛేంజ‌ర్ షూటింగ్‌కు బ్రేక్‌ప‌డింది. సెప్టెంబ‌ర్ షెడ్యూల్‌ను క్యాన్సిల్ చేస్తున్న‌ట్లు నిర్మాణ సంస్థ శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది. కొంద‌రు న‌టీన‌టులు అందుబాటులో లేక‌పోవ‌డంతో షూటింగ్‌ను వాయిదావేయాల్సివ‌చ్చింద‌ని, అక్టోబ‌ర్ సెకండ్ వీక్ నుంచి షూటింగ్‌ను తిరిగి ప్రారంభిస్తామ‌ని ప్ర‌క‌టించింది.

ట్రెండింగ్ వార్తలు

Krishnamma Collection: కృష్ణమ్మ ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్- సత్యదేవ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్- ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Katrina Kaif: హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీపై రూమర్లు.. స్పందించిన టీమ్!

Raajadhani Files TV Premiere: పోలింగ్‍కు ఒక్క రోజు ముందు టీవీ ఛానెల్‍లో రాజధాని ఫైల్స్ సినిమా.. టెలికాస్ట్ టైమ్ ఇదే

Kannappa Movie: ఒక క్యారెక్టర్ చెబితే ప్రభాస్ మరొకటి చేస్తానన్నారు.. ఆ విషయంలో పుకార్లు వద్దు: మంచు విష్ణు

అయితే షూటింగ్ వాయిదాప‌డ‌టానికి అస‌లు కార‌ణం న‌టీన‌టులు అందుబాటులో లేక‌పోవ‌డం కాద‌ని తెలిసింది. రెండు రోజుల క్రితం జ‌రిగిన ఓ ప్ర‌మాదంలో రామ్ చ‌ర‌ణ్ ముఖానికి దెబ్బత‌గిలింది. గాయం తీవ్ర‌త చిన్న‌దే అయినా ప‌ది రోజుల పాటు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని డాక్ట‌ర్లు సూచించిన‌ట్లు స‌మాచారం. రామ్‌చ‌ర‌ణ్ గాయం కార‌ణంగా ఆదివారం నుంచి మొద‌లుకావాల్సిన గేమ్‌ఛేంజ‌ర్ కొత్త షెడ్యూల్‌ను పోస్ట్‌పోన్ చేశారు.

గాయం నుంచి రామ్‌చ‌ర‌ణ్ పూర్తిగా కోలుకున్న త‌ర్వాత‌ ఆక్టోబ‌ర్ 6 నుంచి హైద‌రాబాద్‌లో నెక్స్ట్ షెడ్యూల్‌ను మొద‌లుపెట్ట‌బోతున్నారు. కేజీఎఫ్ ఫేమ్ అన్భు అరివు సార‌థ్యంలో భారీ యాక్ష‌న్ ఎపిసోడ్‌ను తెర‌కెక్కించేందుకు డైరెక్ట‌ర్ శంక‌ర్ ప్లాన్ చేస్తున్నాడు. పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈపాన్ ఇండియ‌న్ సినిమాను దాదాపు 200 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో దిల్‌రాజు నిర్మిస్తున్నాడు.

గేమ్‌ఛేంజ‌ర్ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. విన‌య‌విధేయ‌రామ త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్, కియారా అద్వానీ జంట‌గా న‌టిస్తోన్న సినిమా ఇది. శ్రీకాంత్‌, సునీల్‌, అంజ‌లి, ఎస్‌జే సూర్య‌తో పాటు ప‌లువురు టాలీవుడ్‌, కోలీవుడ్ న‌టీన‌టులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. గేమ్‌ఛేంజ‌ర్ సినిమాకు త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం