Mahesh Babu | సర్కారు వారి పాట ట్రైలర్ వచ్చేది ఆరోజే..?
28 April 2022, 19:29 IST
- మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. మే 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
సర్కారు వారి పాట
సూపర్ స్టార్ మహేశ్ బాబు నుంచి సినిమా వచ్చి రెండేళ్లు దాటిపోయింది. చివరగా సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట. కీర్తి సురేశ్ ఇందులో కథానాయిక. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో అభిమానుల్లో చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక సర్కారు వారి పాట ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం.
ఈ సినిమా ట్రైలర్ను మే 02న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. "మీ అంచనాలను అలాగే ఆకాశమంత ఎత్తులో ఉంచండి. మే 02న ట్రైలర్ వస్తుంది" అంటూ ట్వీట్లో పేర్కొంది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి కళావతి, ఎవ్రీ పెన్నీ లాంటి సాంగ్స్ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేనీ, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఈ చిత్రం తర్వాత మహేశ్.. త్రివిక్రమ్ డైరక్షన్లో ఓ సినిమా చేయడానికి పచ్చజెండా ఊపారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుంది. ఇది కాకుండా టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళితోనూ ఓ చిత్రం చేయబోతున్నారు మహేశ్. ఈ సినిమా కోసం సూపర్స్టార్తో పాటు అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది చివర్లోనే ఈ సినిమా కూడా సెట్స్పైకి వెళ్లే అవకాశముంది.
టాపిక్