తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu: షర్ట్ లేకుండా మహేశ్.. ఎన్నడూ చూడని లుక్‌లో అదుర్స్

Mahesh Babu: షర్ట్ లేకుండా మహేశ్.. ఎన్నడూ చూడని లుక్‌లో అదుర్స్

20 August 2022, 12:05 IST

    • సూపర్ స్టార్ మహేశ్ బాబు తన సరికొత్త లుక్‌లో దర్శనమిచ్చాడు. గుబురు గడ్డంతో పాటు చొక్కా లేకుండా దర్శనమిచ్చిన ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలను మహేశ్ సతీమణి నమ్రతా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
మహేశ్ బాబు
మహేశ్ బాబు (Twitter)

మహేశ్ బాబు

ఇటీవల కాలంలో తన లుక్‌పై ఫుల్ ఫోకస్ పెట్టాడు మన సూపర్ స్టార్ మహేశ్ బాబు. సర్కారు వారి పాట చిత్రంలో పొడుగు జుట్టుతో స్టైలిష్‌గా కనిపించిన మహేశ్.. మరోసారి తన విభిన్న గెటప్‌లో కనిపించనున్నాడు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సూపర్ స్టార్.. ఆ చిత్రం కోసం సన్నద్ధమవుతున్నాడు. ఇటీవలే ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్రబృందం. ఆ సినిమా గుబురు గడ్డంతో కనిపించనున్నాడు. అయితే సిక్స్ ప్యాక్ కూడా చేస్తున్నాడా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ వర్గాలు. తాజాగా స్విమ్మింగ్ పూల్‌లో షర్ట్ లేకుండా దర్శనమిచ్చాడు. ఆ ఫొటోలను మహేశ్ భార్య నమ్రతా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Katrina Kaif: హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీపై రూమర్లు.. స్పందించిన టీమ్!

Raajadhani Files TV Premiere: పోలింగ్‍కు ఒక్క రోజు ముందు టీవీ ఛానెల్‍లో రాజధాని ఫైల్స్ సినిమా.. టెలికాస్ట్ టైమ్ ఇదే

Kannappa Movie: ఒక క్యారెక్టర్ చెబితే ప్రభాస్ మరొకటి చేస్తానన్నారు.. ఆ విషయంలో పుకార్లు వద్దు: మంచు విష్ణు

OTT Telugu Latest Releases: ఈవారం తెలుగులో ఓటీటీల్లోకి వచ్చిన 5 సినిమాలు ఇవే.. ఈ వీకెండ్ ప్లాన్ చేసుకోండి!

"కొన్ని శనివారాలు ఉదయం వేళల్లో పూల్‌లో ఇలాగే కూల్‌గా ఉంటారు" అంటూ మహేశ్ ఫొటోలను షేర్ చేశారు నమ్రత. ఈ ఫొటోల్లో మహేశ్ బాబు గుబురు గడ్డంతో దర్శనమిచ్చారు. ఈ గెటప్‌లో ఇంతవరకు మహేశ్ బాబు ఏ సినిమాలోనూ కనిపించలేదు. అంతేకాకుండా షర్ట్ లేకుండా కనిపించేసరికి మహిళా అభిమానులు ఫిదా అవుతున్నారు.

త్రివిక్రమ్‌తో సినిమా కోసం ఆయన ఈ విధంగా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. సిక్స్ ప్యాక్ కూడా చేస్తున్నట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మహేశ్ లుక్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. నెటిజన్లు కూడా సూపర్ స్టార్‌ లుక్‌పై విశేషంగా స్పందిస్తున్నారు.

త్రివిక్రమ్ కాంబినేషన్‌లో అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరికి కాస్త గ్యాప్ రావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. మహేశ్‌తో హై యాక్షన్ థ్రిల్లర్ తీసేందుకు చూస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటిగ్ బాధ్యతలు చూస్తున్నారు. మహేశ్ బాబుకు ఇది 28వ చిత్రం. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేయాలని చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేసింది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం